వైఎస్సార్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల కలిశారు. తండ్రి వర్థంతి కార్యక్రమంలో వీరు కలుసుకోవడం గమనార్హం. ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాల్లో సీఎం జగన్, షర్మిల ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించడం గమనార్హం. వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి.. సీఎం జగన్, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలవడం తో అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరియు ఇటు వైసీపీ పార్టీ లోనూ నూతన కోలాహలం నెలకొంది. అన్న జగన్ కు రాఖీ కట్టని షర్మిల.. ఇవాలైన కలిసినందుకు అందరూ సంతోషిస్తున్నారు. ఇక వీరిద్దరి కలయిక తో.. వారి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మొన్నటి వరకు గొడవ పడ్డ అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు కలవడం రాజకీయంగా ఏమైనా మార్పులు తీసుకురానుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
This post was last modified on September 2, 2021 11:03 am
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…