ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు ఆగస్టు 31లోగా తప్పుకోవాలంటూ తాలిబన్లు విధించిన డెడ్ లైన్ ను అమెరికా సేనలు తు.చ తప్పకుండా పాటించాయి. గడువు ముగియక ముందే కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా తన చివరి సైనికుడితో సహా అందరినీ వెనక్కి తీసుకెళ్లింది. అమెరికా సేనలున్నపుడే నరమేధానికి పాల్పడిన తాలిబన్లు…తమ గడ్డ మీద నుంచి అమెరికా సేనలు పూర్తిగా వైదొలగడంతో మరోసారి ఉన్మాద పాలనకు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘాన్ లో తాలిబన్లపై పోరు కోసం అమెరికా ఎంత ఖర్చు పెట్టింది? 20 ఏళ్ల పాటు ఆఫ్ఘాన్ లో పాగా వేసిన అమెరికా ఏం సాధించింది? అన్న చర్చ మొదలైంది.
20 ఏళ్ల క్రితం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్పై ఉగ్రవాదుల దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అగ్రరాజ్యం అమెరికాపై ఉగ్రదాడి ఘటనతో ప్రపంచదేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. దీంతో, ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా వార్ డిక్లేర్ చేసింది. అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ను జల్లెడపట్టి తాలిబన్ల సహా పలు ఉగ్రమూకలను తరిమికొట్టి 2001లో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించాయి. 20 ఏళ్లపాటు ఆమెరికా రక్షణలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగింది. తాజాగా అమెరికా సేనలు ఆఫ్ఘాన్ నుంచి వెనుదిరగడంతో 2001 ముందు నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి.
అయితే, ఆఫ్ఘాన్ లో ఉగ్రపోరుకు ఈ 20 ఏళ్ల కాలంలో అమెరికా దాదాపు రూ.146 లక్షల కోట్లు ఖర్చు చేసింది. వివిధ రూపాల్లో అప్పుగా ఈ మొత్తాన్ని అమెరికా తెచ్చింది. 2050 నాటికి వడ్డీతో సహా ఈ అప్పులు రూ.474.30 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అయితే, ఇంత ఖర్చుపెట్టినా….ఈ 20 ఏళ్లలో అమెరికా ఉగ్రవాదంపై పోరులో ఏం సాధించింది అని వెనక్కు తిరిగి చూసుకుంటే…ఏమీ లేదనే సమాధాం వస్తుంది.
ఈ 20 ఏళ్లలో అమెరికా సేనల వల్ల ఆఫ్ఘాన్ లో విద్యుద్ సదుపాయం మెరుగుపడింది. 2001 నాటికి 22 శాతం మందికి మాత్రమే విద్యుత్ సదుపాయం ఉండగా….అది 2019 నాటికి 98 శాతానికి చేరింది. శిశు మరణాల రేటు 50 శాతానికి పైగా తగ్గగా, అక్షరాస్యతా శాతం 37 శాతం పెరిగింది. అయితే, ఇంత ఖర్చు పెట్టినా అమెరికన్లకు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఆఫ్ఘన్ రక్షణ కోసం అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసి అధునాతన ఆయుధాలు సమకూర్చింది.
వెళ్లేటప్పుడు వీలైనన్ని ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాలను ఆఫ్ఘన్లోనే వదిలేసింది. అయితే, అమెరికా టెక్నీషియన్లు తప్ప మరెవరు వాటిని రిపేర్ చేయడానికి వీలు లేకుండా చాలా వరకు నిర్వీర్యం చేసింది. ఈ 20 ఏళ్ల కాలంలో వేలాది మంది అమెరికా సైనికులు, పౌరులు ఆఫ్ఘాన్ యుద్ధంలో మరణించారు. ఉగ్రవాదంపై పోరు అంతులేని కథలా అలాగే మిగిలింది. 20 ఏళ్లు పోరాడి…లక్షల కోట్ల అప్పును అమెరికా పౌరుల నెత్తి మీద పెట్టి…ఆ దేశాన్ని తాలిబన్ల చేతిలో అమెరికా అధ్యక్షఉడు బైడెన్ పెట్టారని విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on September 1, 2021 7:27 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…
అక్కినేని కుటుంబం నుంచి ఘనంగా అరంగేట్రం చేసిన కథానాయకుల్లో సుమంత్ ఒకడు. కానీ తన కెరీర్ పుంజుకోవడానికి చాలా టైం…
స్టార్ పవర్ అంటే మాటల్లో కొలిచేది కాదు. దాని సత్తా ఏ స్థాయిలో ఉంటుదంటే ఒక్కసారి ట్రేడ్ వర్గాలకు సైతం…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…