తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘‘ శ్రీవారి ధనప్రసాదం ’’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి టీటీడీ భక్తులకు అందజేస్తోంది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన నాణేలను తిరిగి భక్తులకు శ్రీవారి ధనప్రసాదంగా అందజేస్తోంది.
చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవడంతో.. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. వంద రూపాయల చిల్లర నాణేలు ప్యాకెట్లను ఎంక్వైరీ కార్యాలయం వద్ద టీటీడీ అందుబాటులో ఉంచింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటారు. కేవలం నోట్లే కాకుండా చిల్లర నాణేలు సైతం హుండీలో వేస్తుంటారు. నూట పదహార్లు.. వెయ్యి నూట పదహార్ల రూపంలో నోట్లతోపాటు చిల్లర కూడా సమర్పించుకునేవారు ఎక్కువ.
ఈ చిల్లర ఎక్కువగా ఉంటుండటంతో.. లెక్కింపు అనంతరం టీటీడీ దాన్ని బ్యాంకులో జమ చేస్తోంది. కానీ చిల్లర తీసుకోవడానికి బ్యాంకులు వెనుకాడుతున్నాయి. మరోవైపు శ్రీవారి ఆలయంలోని హుండీల్లో ఉంచిన ధనం కావడం.. భక్తులు పవిత్రభావంతో ‘ధన ప్రసాదాన్ని’ స్వీకరిస్తారని.. తద్వారా చిల్లర సమస్యకు పరిష్కారం లభిస్తుందని టీటీడీ ఆశిస్తోంది.
This post was last modified on September 1, 2021 7:24 pm
కృత్రిమ మేధ (AI) రంగంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ మధ్య ఉన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. గతంలో…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న లైలా విషయంలో విశ్వక్ సేన్ చాలా టెన్షన్ గా ఉన్నాడు. చిరంజీవి ప్రీ…
ఏపీ బీజేపీలో సీనియర్ నాయకుల మధ్య కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా.. నాకెందుకులే అని…
స్టార్ క్యాస్టింగ్ లేని చిన్న సినిమాలకు కంటెంటే బలం. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు అంతా బాగా…
ఏపీ సీఎం చంద్రబాబు పాలన మధ్యతరగతికి పరిమితం అవుతోందా? ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేలానే ఉన్నాయా?…
ఎవరికైనా హీరోల మీద అభిమానం ఉంటే ఏం చేస్తాం. పోస్టర్లు దాచుకుంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తాం.…