చాలాకాలం తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా గతేడాది పాఠశాలలన్నీ మూతబడ్డాయి. మొదటి వేవ్ కారణంగా ఎన్నో రోజుల పాటు మూతపడ్డ స్కూళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేయడంతో మళ్ళీ తాళాలు వేసుకోవాల్సి వచ్చింది.
సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కేసుల తగ్గుదల దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు అన్నీ పాటిస్తూ, పాఠశాలలు తెరుచుకుంటున్నాయి.
రెసిడెన్షియల్ స్కూళ్ళు మినహా మిగతా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ క్లాసుల నిర్ణయం స్కూళ్ళదే అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. పాఠశాలలకు పిల్లలు రావడంపై తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఎన్నో రోజులు మూతబడ్డ పాఠశాలలు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి.
This post was last modified on September 1, 2021 11:51 am
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…