చాలాకాలం తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా గతేడాది పాఠశాలలన్నీ మూతబడ్డాయి. మొదటి వేవ్ కారణంగా ఎన్నో రోజుల పాటు మూతపడ్డ స్కూళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేయడంతో మళ్ళీ తాళాలు వేసుకోవాల్సి వచ్చింది.
సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కేసుల తగ్గుదల దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు అన్నీ పాటిస్తూ, పాఠశాలలు తెరుచుకుంటున్నాయి.
రెసిడెన్షియల్ స్కూళ్ళు మినహా మిగతా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ క్లాసుల నిర్ణయం స్కూళ్ళదే అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది. పాఠశాలలకు పిల్లలు రావడంపై తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఎన్నో రోజులు మూతబడ్డ పాఠశాలలు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి.
This post was last modified on September 1, 2021 11:51 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…