ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలా అమెరికా రక్షణ దళం.. ఆప్ఘానిస్తాన్ ని వదిలేసి వెళ్లిందో లేదో.. ఇలా తాలిబాన్లు తమ అరాచకాలను రెట్టింపు చేయడం గమనార్హం.
అమెరికా సైన్యం వదిలేసి వెళ్లిన ఆయుధాలు, హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేటాడుతున్నారు. తాజాగా ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి తీసుకెళ్లారు తాలిబన్లు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తొలుత ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపిన తాలిబన్లు ఆపై అమెరికా మిలటరీ హెలికాప్టర్కు ఆ మృతదేహాన్ని తాడుతో కట్టి కాందహార్ మొత్తం చక్కర్లు కొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోల్లో హెలికాప్టర్కు తాడుతో వేలాడుతున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడా? లేక అది మృతదేహమా? అన్ని స్పష్టంగా కనిపించడం లేదు. అయితే, చంపేసిన వ్యక్తినే తాలిబన్లు ఇలా వేలాడదీస్తూ హెలికాప్టర్లో ప్రదర్శన ఇచ్చారని చెబుతున్నారు.
తాలిబన్లది చెబుతున్న తాలిబ్ టైమ్స్ ట్విట్టర్ ఖాతా మాత్రం.. తమ ఎయిర్ ఎయిర్ ఫోర్స్.. ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్స్ ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లు కాందహార్ నగరం మీదుగా పెట్రోలింగ్ చేస్తున్నట్టు పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా గత నెలలోనే 7 బ్లాక్ హాక్ చాపర్లను అందించింది. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్కు అందించిన వాటికి ఇవి అదనం. ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు గత రాత్రి పూర్తిగా వైదొలగడానికి ముందు 73 విమానాలు, 27 హమ్వీస్, ఆయుధ సంపత్తి, ఇతర హైటెక్ డిఫెన్స్ పరికరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది.
This post was last modified on August 31, 2021 9:08 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…