ఈనాడు పత్రికలో వార్తలకంటే ముందు పాఠకులు ఎంతో ఆసక్తిగా చూసే అంశం.. కార్టూన్. తెలుగులో దశాబ్దాలుగా నంబర్ వన్ కార్టూనిస్ట్గా కొనసాగుతున్న శ్రీధర్ ఈ కార్టూన్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈనాడుతో శ్రీధర్ది విడదీయరాని అనుబంధం. ఈనాడు పత్రిక వయసు 41 ఏళ్లయితే.. అందులో 40 సంవత్సరాలు శ్రీధర్ పని చేయడం విశేషం. అంటే ఈనాడుతో ఆరంభం నుంచి కొనసాగుతున్నారన్నమాట.
ఆయన కార్టూన్ల స్థాయి గురించి.. అవెంతగా తెలుగు పాఠకులకు అలరించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏవో కొన్ని అరుదైన సందర్భాల్లో తప్ప ‘ఈనాడు’లో శ్రీధర్ కార్టూన్ లేని రోజు లేదు ఈ 40 ఏళ్లలో. అలాంటిది రేపట్నుంచి ఆ పత్రికలో శాశ్వతంగా శ్రీధర్ కార్టూన్ కనిపించబోదు. ఎందుకంటే శ్రీధర్ ‘ఈనాడు’కు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘లెఫ్ట్ ఈనాడు. రిజైన్డ్’ అంటూ ఓ సంక్షిప్త సందేశంతో ఆయనీ బ్రేకింగ్ న్యూస్ను వెల్లడించారు.
దీంతో శ్రీధర్ అభిమానులందరూ షాక్కు గురయ్యారు. ఈనాడు లేని శ్రీధర్ను.. శ్రీధర్ లేని ఈనాడును ఊహించుకోవడం చాలా చాలా కష్టం. ఆ రెంటికీ ఉన్న అనుబంధం అలాంటిది. శ్రీధర్ కార్టూన్ లేని ఈనాడు పత్రిక కళ తప్పుతుందనడంలో సందేహం లేదు. ఆ పత్రికకు ఆయనొక వెల కట్టలేని ఆస్తే. మరి ఎందుకు ఆయన ఆ పత్రికను వదిలిపెడుతున్నారన్న ప్రశ్న అందరినీ తొలిచి వేస్తోంది.
శ్రీధర్ మరో పత్రికలో చేరే అవకాశాలు దాదాపు లేనట్లే అన్నది సన్నిహిత వర్గాల మాట. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ వయసు దాటేశారు. అయినా ఈనాడుతో కొనసాగుతూ వచ్చారు. ఐతే ఈ మధ్య ఆరోగ్యం సహకరించకపోవడం.. కరోనా కారణంగా కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని కోల్పోవడంతో ఆయన మానసికంగా కుంగిపోయారని.. అందుకే ఇక తన వృత్తికి సెలవిచ్చి ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటున్నారని.. అందుకే రిజైన్ చేసి ఉండొచ్చని సన్నిహితులు అంటున్నారు.
This post was last modified on August 30, 2021 10:55 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…