మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనగానే ఎవరైనా అమరావతి అని చెప్పేవారు. అయితే.. జగన్ సర్కార్ మాత్రం విశాఖ ను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సడెన్ గా.. కేంద్ర ప్రభుత్వం.. విశాఖను ఏపీ రాజధానిగా పేర్కొంటూ కామెంట్స్ చేసింది. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది. అందుకే.. వెంటనే కేంద్రం తాను చేసిన పొరపాటును సరిచేసుకుంది.
ఏపీ క్యాపిటల్ విశాఖ కాదని క్లారిటీ ఇచ్చింది. విశాఖ కేవలం ఏపీలోని ఓ నగరం మాత్రమేనని స్పష్టంగా చెప్పింది. పెట్రోలియం ట్యాక్స్లకు సంబంధించిన రిప్లైలో విశాఖ పేరును మాత్రమే ఉదహరించామని చెప్పుకొచ్చింది. హెడ్డింగ్లో రాజధాని అని ఉన్న చోట విశాఖ అని రాయడం వల్ల ఈ తప్పిదం జరిగినట్టు కేంద్రం ఒప్పుకుంది. జులై 26న లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా కేంద్రం సమాధానమిచ్చింది. అయితే, ఏపీ రాజధాని విశాఖ అని చెప్పటం తమ ఉద్దేశం కాదని కేంద్రం స్పష్టం చేసింది.
పెట్రో ధరల పెరుగుదల వల్ల దేశంపై పడుతున్న ప్రభావం, వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇందులో వివిధ రాష్ట్రాల పేర్లు, దాని పక్కనే రాజధాని అని ఉన్న చోట విశాఖ అని పెట్టి.. రిప్లై ఇచ్చింది. ఒక్క విశాఖనే కాదు హర్యానా రాజధాని అంబాలా అని, పంజాబ్కు జలంధర్ అని పెట్టి పంపించింది కేంద్రం.
దీంతో సోషల్ మీడియాలో రాజధానులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్రం తీరుపై సెటైర్లు కూడా వేశారు. ఆలస్యంగానైనా స్పందించిన కేంద్రం ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దీంతో తప్పును సరిదిద్దుకున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. సమాధానంలోని రాజధాని అన్న హెడ్డింగ్ కింద ఇచ్చిన నగరాలను కేవలం ఆ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి చెప్పడానికి నిర్దేశించామని వెల్లడించింది. ఆ హెడ్డింగ్ను కేవలం రాజధాని అని మాత్రమే కాకుండా రాజధాని లేదా రిఫెరెన్స్ సిటీగా చదువుకోవాలని కోరుతున్నామని తెలిపింది. ఈ మేరకు మార్పు చేసి లోక్సభ సచివాలయానికి తెలిపామని పెట్రోలియం శాఖ పేర్కొంది.
This post was last modified on August 30, 2021 8:28 am
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…