Political News

వైజాగ్ ను ఏపీ రాజధానిగా డిసైడ్ అయిన మోడీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అన్న ప్రశ్నను అడిగితే..అమరావతి అన్న మాట వినిపిస్తుంది. విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో రాజధానిగా ప్రస్తుతానికి అమరావతిగానే భావిస్తున్నారు ఏపీ ప్రజలు. అయితే.. ఘనత వహించిన మోడీ సర్కారు మాత్రం వైజాగ్ ను పాలనా రాజధానిగా గుర్తించేసినట్లుగా తాజాగా బయటకు వచ్చిన ఒక డాక్యుమెంట్ స్పష్టం చేయటం సంచలనంగా మారింది.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా పేర్కొంటూ.. దాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరు కావటం.. ఒక బిందె నిండా నీళ్లను (పవిత్రజలాలు).. మరో బిందె నిండా మట్టిని (అన్ని రాష్ట్రాల పవిత్ర మట్టిని) ఇచ్చి.. అద్భుతమైన రాజధానిగా.. ఆ మాటకు వస్తే ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆ విషయంలో మరో మాటకు తావు లేదన్నట్లుగా బిల్డప్ ఇవ్వటం తెలిసిందే.

అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయం తీసుకున్న బాబు సర్కారుకు భిన్నంగా.. జగన్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఏపీకి ఒకటి కాదు.. అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం లభించేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రావటం.. పాలనా రాజధానిగా విశాఖ.. అసెంబ్లీ సమావేశాలకు అమరావతి.. జ్యూడిషియల్ క్యాపిటల్ గా కర్నూలును నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే..దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమరావతి వాసులతో పాటు పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన నిర్ణయం పెండింగ్ లో ఉంది. అలాంటప్పుడు.. కేంద్రం కానీ మరొకరు కానీ విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించే అవకాశం లేదు.

తాజాగా.. వివిధ రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పెట్రోల్ సుంకాలపై లోక్ సభలో అడిగిన ప్రశ్నకు తాజాగా కేంద్రం సమాధానం ఇచ్చింది. వాస్తవానికి ఈ పత్రం ఇచ్చి కొద్ది రోజులు అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా చూసినప్పుడు ఏపీ రాజధానిగా విశాఖ పట్టణాన్ని చూపించటం షాకింగ్ గా మారింది. ఆలస్యంగా బయటకు వచ్చిన తాజా పత్రం కలకలం రేపుతోంది. వాస్తవానికి జులై 26న సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాల వారీగా పన్నులు.. సుంకాల వ్యత్యాసాన్నిసదరు పత్రంలో వివరంగా కేంద్రం తెలియజేసింది. అయితే.. అందులోని అంకెల మీదనే అందరి ఫోకస్ ఉంది తప్పించి.. రాజధాని నగరంగా దేన్ని పేర్కొన్నారన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించారు. ఏపీ రాజధానిగా విశాఖను కేంద్రం చూపించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. దీనిపై వెల్లువెత్తుతున్న విమర్శలకు కేంద్రం ఏమని బదులిస్తుందో చూడాలి.

This post was last modified on August 29, 2021 6:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago