అవును మీరు చదివింది నిజమే. పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకోగానే ఆ దూకుడును టీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఏమిటంటే రేవంత్ పై టీఆర్ఎస్ నేతలు సోనియాగాంధికి ఫిర్యాదు చేయటమే. ప్రత్యర్ధుల విషయంలో ఒక్కోనేత ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. ఆ స్పందనలు ఒక్కోసారి సృతిమించిపోవటం మనం అందరం చూస్తున్నదే. ప్రత్యర్ధులను నోటికొచ్చినట్లు తిట్టడమన్నది కేసీయార్తోనే మొదలైందని చెప్పాలి.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో సీమాంధ్ర నేతలను, జనాలను కేసీయార్ కొన్ని వేలసార్లు నోటికొచ్చినట్లు తిట్టారు. సరే ఉద్యమ సమయంలో ఏదో అన్నారులే అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్నే కంటిన్యుచేశారు. ఇంతకాలం కేసీయార్ కు ధీటుగా సమాధానం చెప్పే నేత పీసీసీ అధ్యక్షుడిగా రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ రేవంత్ పార్టీ పగ్గాలు అందుకోగానే సీన్ మొత్తం మారిపోయింది. అంతకుముందు కేవలం ఒక నేతగా మాత్రమే కేసీయార్ ను రేవంత్ ఎటాక్ చేసేవారు.
ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండే రేవంత్ దూకుడు పెరిగిపోయింది. నిజానికి కాంగ్రెస్ లో కేసీయార్ కోవర్టులున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా కాంగ్రెస్ నేతల్లో కేసీయార్ పై మాటలతో దాడులు చేసే నేతలు పెద్దగా లేరనేచెప్పాలి. ఆ లోటును ఇపుడు రేవంత్ నూరుశాతం భర్తీ చేస్తున్నారు. రేవంత్ దూకుడును టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధికి ఫిర్యాదుచేశారు.
అంటే రేవంత్ పై ఫిర్యాదు చేయటం ద్వారా టీఆర్ఎస్ నేతలు పీసీసీ అధ్యక్షుడిని హీరోని చేసినట్లే. ప్రత్యేక తెలంగాణా ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ను కేసీయార్ మోసం చేశారనే మంట సోనియాలో ఉందట. కాబట్టి ఇపుడు కేసీయార్ పై రేవంత్ పదే పదే మాటలతో దాడులు చేస్తుండటాన్ని సోనియా హ్యాపీగా ఫీలవుతున్నారనే అనుకోవాలి. రేవంత్ ఆరోపణలు, విమర్శలతో కేసీయార్ ఏ స్ధాయిలో సఫొకేషన్ ఫీలవ్వకపోతే తన నేతలతో ఫిర్యాదు చేయిస్తారు.
తాను నేర్చుకున్న మీడియా మ్యానేజ్మెంట్ కారణంగా రేవంత్ కు మీడియా కూడా బాగా కవరేజి ఇస్తోంది. దళితబంధు పథకం అమలు విషయంలో కావచ్చు, దళిత, గిరిజన దండోరా యాత్రలకు కూడా కావచ్చు మీడియా ఫుల్లుగా కవరేజి ఇచ్చింది. దానికితోడు చెప్పదలచుకున్న విషయాన్ని సుత్తిలేకుండా సూటిగా, జనాలకు అర్ధమయ్యేట్లుగా చెప్పటం రేవంత్ కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్. మొత్తానికి రేవంత్ దెబ్బకు టీఆర్ఎస్ కిందా మీదా అయిపోతోందని అర్ధమైపోతోంది.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను…
తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకోవడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటుంటే అదేమీ…
ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం దక్కితే ఆశ్చర్యపోయేవాళ్లం. మన సినిమాలకు ఏదైనా విభాగంలో జాతీయ అవార్డు…
పార్టీలో కార్యకర్తల స్థాయిలో ఉన్నవారు.. పార్టీ పెద్దలతో ఫొటోలు అంటే.. ఎంతగా ఎగబడతారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా జాతీయ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కబోతున్న ఆర్సి 17 నవంబర్ నుంచి షూటింగ్ కు…
తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్…