వైసీపీ నేతలు ఏ ఇద్దరు కలిసినా.. ఇప్పుడు.. మూడు రాజధానుల విషయంపైనే చర్చించుకుంటున్నారు. నిజానికి ఏడాదిన్నరకు పైగానే ఈ విషయం చర్చనీయాంశంగా ఉంది. అయితే.. ఇప్పటి వరకు కోర్టు లు కేసులు.. అంటూ.. వివాదంగా మారింది. మరోవైపు.. రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ.. అక్కడి రైతులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మూడు రాజధానుల విషయంపై వైసీపీ నాయకులు బాహాటంగా మాట్లాడుకోలేక పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు మళ్లీ ఈవిషయంపై నేతల మధ్య చర్చ మొదలైంది.
మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని.. వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. అంతేకాదు.. న్యా య పరమైన ఇబ్బందులు కూడా తొలిగిపోతాయని.. త్వరలోనే రాజధాని మార్పు ఖాయమని.. చెబుతు న్నారు. మరి దీనికి రీజనేంటి? ఎందుకు ఒక్కసారిగా వైసీపీ నేతల్లో ఆశలు పుంజుకున్నాయి? అనే విష యాన్ని పరిశీలిస్తే.. ఇటీవల హైకోర్టు.. ఒక విషయంలో రాష్ట్ర ప్రబుత్వానికి సానుకూలంగా వ్యాఖ్యానిం చింది. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు విషయంలో జరిగిన విచారణలో.. ఈ కమిషన్ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది.. రాష్ట్ర సర్కారు ఇష్టమని.. కోర్టు స్పష్టం చేసింది.
దీంతో ప్రభుత్వానికి న్యాయ పరంగా మద్దతు లభించినట్టు అయిదని.. నిపుణులు కూడా వ్యాఖ్యానించారు. ఇక, ఈ క్రమంలో మూడు రాజధానులకు కూడా న్యాయపరమైన చిక్కులు తొలిపోవడం ఖాయమని అం టున్నారు వైసీపీనాయకులు. ఎలా అంటే.. మూడు రాజధానులు ఉండాలా? 30 రాజధానులు ఉండాలా? అనే విషయంలో తమకు సంబంధం లేదని.. కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని.. అంతేకాకుండా.. విభజన చట్టంలోనూ ఒకే రాజధాని నిర్మించుకోవాలని లేదని.. కూడా పేర్కొంది. ఇక, ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా.. ఖచ్చితంగా మూడుకు న్యాయపరంగా చిక్కులు తొలిగిపోవడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంపై జోరుగా చర్చసాగుతుండడం గమనార్హం. అయితే.. ఇప్పటికే కోర్టులో ఈ కేసులు ఉండడంతో ఎటూ మాట్లాడలేక పోతున్నారు. బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా.. లోలోన మాత్రం మురిసిపోతుండడం గమనార్హం.
This post was last modified on August 29, 2021 10:39 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…