Political News

వైసీపీలో ‘మూడు’ జోష్ పెరిగిందే…!

వైసీపీ నేత‌లు ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ఇప్పుడు.. మూడు రాజ‌ధానుల విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి ఏడాదిన్న‌ర‌కు పైగానే ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు లు కేసులు.. అంటూ.. వివాదంగా మారింది. మ‌రోవైపు.. రాజ‌ధాని అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ.. అక్క‌డి రైతులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో.. మూడు రాజ‌ధానుల విష‌యంపై వైసీపీ నాయ‌కులు బాహాటంగా మాట్లాడుకోలేక పోయిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ ఈవిష‌యంపై నేత‌ల మ‌ధ్య చ‌ర్చ మొద‌లైంది.

మూడు రాజ‌ధానుల ఏర్పాటు ఖాయ‌మ‌ని.. వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. అంతేకాదు.. న్యా య ప‌ర‌మైన ఇబ్బందులు కూడా తొలిగిపోతాయ‌ని.. త్వ‌ర‌లోనే రాజ‌ధాని మార్పు ఖాయ‌మ‌ని.. చెబుతు న్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? ఎందుకు ఒక్క‌సారిగా వైసీపీ నేత‌ల్లో ఆశ‌లు పుంజుకున్నాయి? అనే విష యాన్ని ప‌రిశీలిస్తే.. ఇటీవ‌ల హైకోర్టు.. ఒక విష‌యంలో రాష్ట్ర ప్ర‌బుత్వానికి సానుకూలంగా వ్యాఖ్యానిం చింది. రాష్ట్రంలో మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ఏర్పాటు విష‌యంలో జ‌రిగిన విచార‌ణ‌లో.. ఈ క‌మిష‌న్‌ను ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది.. రాష్ట్ర స‌ర్కారు ఇష్ట‌మ‌ని.. కోర్టు స్ప‌ష్టం చేసింది.

దీంతో ప్ర‌భుత్వానికి న్యాయ ప‌రంగా మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్టు అయిద‌ని.. నిపుణులు కూడా వ్యాఖ్యానించారు. ఇక‌, ఈ క్ర‌మంలో మూడు రాజ‌ధానుల‌కు కూడా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు తొలిపోవ‌డం ఖాయ‌మ‌ని అం టున్నారు వైసీపీనాయ‌కులు. ఎలా అంటే.. మూడు రాజ‌ధానులు ఉండాలా? 30 రాజ‌ధానులు ఉండాలా? అనే విష‌యంలో త‌మ‌కు సంబంధం లేద‌ని.. కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింద‌ని.. అంతేకాకుండా.. విభ‌జ‌న చ‌ట్టంలోనూ ఒకే రాజ‌ధాని నిర్మించుకోవాల‌ని లేద‌ని.. కూడా పేర్కొంది. ఇక‌, ఎక్క‌డ ఏర్పాటు చేసుకోవాల‌నే విష‌యం కూడా ప్ర‌భుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ క్ర‌మంలో తాజాగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ద‌రిమిలా.. ఖ‌చ్చితంగా మూడుకు న్యాయ‌పరంగా చిక్కులు తొలిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం ఇదే విష‌యంపై జోరుగా చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్ప‌టికే కోర్టులో ఈ కేసులు ఉండ‌డంతో ఎటూ మాట్లాడ‌లేక పోతున్నారు. బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. లోలోన మాత్రం మురిసిపోతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 29, 2021 10:39 am

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

2 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

4 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

6 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

8 hours ago