వైసీపీ నేతలు ఏ ఇద్దరు కలిసినా.. ఇప్పుడు.. మూడు రాజధానుల విషయంపైనే చర్చించుకుంటున్నారు. నిజానికి ఏడాదిన్నరకు పైగానే ఈ విషయం చర్చనీయాంశంగా ఉంది. అయితే.. ఇప్పటి వరకు కోర్టు లు కేసులు.. అంటూ.. వివాదంగా మారింది. మరోవైపు.. రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ.. అక్కడి రైతులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మూడు రాజధానుల విషయంపై వైసీపీ నాయకులు బాహాటంగా మాట్లాడుకోలేక పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు మళ్లీ ఈవిషయంపై నేతల మధ్య చర్చ మొదలైంది.
మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని.. వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. అంతేకాదు.. న్యా య పరమైన ఇబ్బందులు కూడా తొలిగిపోతాయని.. త్వరలోనే రాజధాని మార్పు ఖాయమని.. చెబుతు న్నారు. మరి దీనికి రీజనేంటి? ఎందుకు ఒక్కసారిగా వైసీపీ నేతల్లో ఆశలు పుంజుకున్నాయి? అనే విష యాన్ని పరిశీలిస్తే.. ఇటీవల హైకోర్టు.. ఒక విషయంలో రాష్ట్ర ప్రబుత్వానికి సానుకూలంగా వ్యాఖ్యానిం చింది. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు విషయంలో జరిగిన విచారణలో.. ఈ కమిషన్ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది.. రాష్ట్ర సర్కారు ఇష్టమని.. కోర్టు స్పష్టం చేసింది.
దీంతో ప్రభుత్వానికి న్యాయ పరంగా మద్దతు లభించినట్టు అయిదని.. నిపుణులు కూడా వ్యాఖ్యానించారు. ఇక, ఈ క్రమంలో మూడు రాజధానులకు కూడా న్యాయపరమైన చిక్కులు తొలిపోవడం ఖాయమని అం టున్నారు వైసీపీనాయకులు. ఎలా అంటే.. మూడు రాజధానులు ఉండాలా? 30 రాజధానులు ఉండాలా? అనే విషయంలో తమకు సంబంధం లేదని.. కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని.. అంతేకాకుండా.. విభజన చట్టంలోనూ ఒకే రాజధాని నిర్మించుకోవాలని లేదని.. కూడా పేర్కొంది. ఇక, ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా.. ఖచ్చితంగా మూడుకు న్యాయపరంగా చిక్కులు తొలిగిపోవడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంపై జోరుగా చర్చసాగుతుండడం గమనార్హం. అయితే.. ఇప్పటికే కోర్టులో ఈ కేసులు ఉండడంతో ఎటూ మాట్లాడలేక పోతున్నారు. బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా.. లోలోన మాత్రం మురిసిపోతుండడం గమనార్హం.
This post was last modified on August 29, 2021 10:39 am
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…