Political News

వైసీపీలో ‘మూడు’ జోష్ పెరిగిందే…!

వైసీపీ నేత‌లు ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ఇప్పుడు.. మూడు రాజ‌ధానుల విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి ఏడాదిన్న‌ర‌కు పైగానే ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు లు కేసులు.. అంటూ.. వివాదంగా మారింది. మ‌రోవైపు.. రాజ‌ధాని అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ.. అక్క‌డి రైతులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో.. మూడు రాజ‌ధానుల విష‌యంపై వైసీపీ నాయ‌కులు బాహాటంగా మాట్లాడుకోలేక పోయిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ ఈవిష‌యంపై నేత‌ల మ‌ధ్య చ‌ర్చ మొద‌లైంది.

మూడు రాజ‌ధానుల ఏర్పాటు ఖాయ‌మ‌ని.. వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. అంతేకాదు.. న్యా య ప‌ర‌మైన ఇబ్బందులు కూడా తొలిగిపోతాయ‌ని.. త్వ‌ర‌లోనే రాజ‌ధాని మార్పు ఖాయ‌మ‌ని.. చెబుతు న్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? ఎందుకు ఒక్క‌సారిగా వైసీపీ నేత‌ల్లో ఆశ‌లు పుంజుకున్నాయి? అనే విష యాన్ని ప‌రిశీలిస్తే.. ఇటీవ‌ల హైకోర్టు.. ఒక విష‌యంలో రాష్ట్ర ప్ర‌బుత్వానికి సానుకూలంగా వ్యాఖ్యానిం చింది. రాష్ట్రంలో మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ఏర్పాటు విష‌యంలో జ‌రిగిన విచార‌ణ‌లో.. ఈ క‌మిష‌న్‌ను ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది.. రాష్ట్ర స‌ర్కారు ఇష్ట‌మ‌ని.. కోర్టు స్ప‌ష్టం చేసింది.

దీంతో ప్ర‌భుత్వానికి న్యాయ ప‌రంగా మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్టు అయిద‌ని.. నిపుణులు కూడా వ్యాఖ్యానించారు. ఇక‌, ఈ క్ర‌మంలో మూడు రాజ‌ధానుల‌కు కూడా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు తొలిపోవ‌డం ఖాయ‌మ‌ని అం టున్నారు వైసీపీనాయ‌కులు. ఎలా అంటే.. మూడు రాజ‌ధానులు ఉండాలా? 30 రాజ‌ధానులు ఉండాలా? అనే విష‌యంలో త‌మ‌కు సంబంధం లేద‌ని.. కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింద‌ని.. అంతేకాకుండా.. విభ‌జ‌న చ‌ట్టంలోనూ ఒకే రాజ‌ధాని నిర్మించుకోవాల‌ని లేద‌ని.. కూడా పేర్కొంది. ఇక‌, ఎక్క‌డ ఏర్పాటు చేసుకోవాల‌నే విష‌యం కూడా ప్ర‌భుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ క్ర‌మంలో తాజాగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ద‌రిమిలా.. ఖ‌చ్చితంగా మూడుకు న్యాయ‌పరంగా చిక్కులు తొలిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం ఇదే విష‌యంపై జోరుగా చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్ప‌టికే కోర్టులో ఈ కేసులు ఉండ‌డంతో ఎటూ మాట్లాడ‌లేక పోతున్నారు. బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. లోలోన మాత్రం మురిసిపోతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 29, 2021 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

4 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

4 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

5 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

5 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

6 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

7 hours ago