Political News

వేట మొదలైంది

ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వేట మొదలైంది. గురువారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవ బాంబు పేలుడులో 170 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇంతే సంఖ్యలో జనాలు, సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడికి ఐఎస్ఐఎస్(ఐసిస్) తీవ్రవాదులే కారణమని అమెరికా అనుమానించింది. దీనికి తగ్గట్లే తామే పేలుడు జరిపినట్లు ఐసిస్-కే ప్రకటించుకుంది. దీంతో వెంటనే ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దృష్టిపెట్టింది.

ఐసిస్ నేతలు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా హెచ్చరించారు. హెచ్చరికలు చేసినట్లే 24 గంటల్లోనే దాడులు మొదలు పెట్టేశారు. ఆఫ్ఘనిస్ధాన్లోని ఐసిస్ స్ధావరాలు ఎక్కడెక్కడున్నాయో వాటన్నింటిపైనా అమెరికా డ్రోన్లు, విమానాలతో శనివారం ఉదయం నుండి దాడులు మొదలు పెట్టింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది తీవ్రవాదులు హతమయ్యారనే విషయం కానీ లేకపోతే ఎన్ని స్థావరాలను ధ్వంసం చేశామని కానీ అమెరికా ప్రకటించలేదు.

జరిగిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని తాలిబన్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పైకి ఐసిస్-తాలిబన్ల మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్నా లోలోపల అంతా ఒకటే అని అమెరికా అనుమానిస్తున్నారు. ఐసిస్-కే పేరుతో ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్లోని కునార్, నాన్ గుర్హర్, నూరిస్ధాన్ ప్రావిన్సుల్లో ఐసిస్-కే తీవ్రవాద సంస్ధ చాలా బలంగా ఉంది. దీనికున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తాలిబన్లకు ఉపయోగిస్తున్నట్లు అమెరికా అనుమానిస్తున్నది.

దాడులకు ముందు జాగ్రత్తగా కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర నుండి మామూలు జనాలను వెళ్ళిపోవాలంటు అమెరికా ప్రకటించింది. తాము ఐసిస్ మూకలపై దాడులు మొదలుపెట్టగానే తమపై కోపంతో తీవ్రవాదులు మళ్ళీ మామూలు జనాలపై దాడులు జరపవచ్చని అమెరికా అనుమానిస్తోంది. అందుకనే అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని పదే పదే చెబుతోంది. అయితే జనాల్లో చాలామంది పట్టించుకోవటంలేదు.

ఎందుకంటే ఏ విమానం కాబూల్ విమానాశ్రయం నుండి బయలు దేరుతున్నా దాంట్లో ఎక్కి ఏదో దేశానికి వెళ్ళిపోవాలనే ఆతృతలో జనాలున్నారు. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేకపోతున్నారు జనాలు. ముందు ఆఫ్ఘనిస్ధాన్ నుండి బయటపడితే చాలన్నట్లు గా ఉంది వాళ్ళ పరిస్థితి. అందుకనే ఏ విమానం బయలు దేరుతున్నా అందులోకి ఎక్కటానికి జనాలు ఎగబడుతున్నారు. పాస్ పోర్టు, వీసాలు లేకపోయినా పర్వాలేదని చాలాదేశాలు అనుకున్న కారణంగా జనాలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు.

This post was last modified on August 28, 2021 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago