Political News

ఆ కామెంట్లు మ‌న గురించేనంటావా.. వైసీపీలో గుస‌గుస‌..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇటీవ‌ల కాలంలో ఉలికిపాటు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దేశం ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఇక్క‌డ వైసీపీకి అంట‌గ‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డంతో.. వైసీపీ నాయ‌కులు ప‌ర‌స్ప‌రం ఫోన్లు చేసుకుని .. ‘ఆ కామెంట్లు మ‌న‌గురించేనంటావా?` అని గుస‌గుస‌లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఓ వారం కింద‌ట‌.. తెలంగాణ హైకోర్టు.. అక్క‌డి కేసీఆర్ స‌ర్కారును ఒక విష‌యంలో నిల‌దీసింది. అక్క‌డ అమ‌లు చేస్తున్న ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి.. స‌రైన నిబంధ‌న‌లు రూపొందించ‌లేద‌ని.. దీనివ‌ల్ల‌.. ల‌బ్ధిదారుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని.. పేర్కొంటూ. దాఖ‌లైన పిటిష‌న్‌పై.. విచార‌ణ చేప‌ట్టింది.

ఈ క్ర‌మంలో.. తెలంగాణ హైకోర్టు.. జీవోల‌ను దాచ‌డానికి వీల్లేద‌ని.. ర‌హ‌స్య జీవోలు ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మూ లేద‌ని.. స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. 24 గంట‌ల్లోనే.. జీవోల‌ను ఆన్‌లైన్‌లో పెట్టాల‌ని కూడా ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే.. ఈ విష‌యం ఏపీలో కాక‌రేపింది. ఇదే ప‌రిస్థితి మ‌న ద‌గ్గ‌రా ఉందిక‌దా.. మ‌న గురించి కూడా వ్యాఖ్యలు అనుసంధానం అవుతాయా ? అంటూ.. వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుకున్నారు. ఇక‌, వైసీపీ వ్య‌తిరేక మీడియాలో ఈ కామెంట్లు జోరుగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. మొత్తంగా.. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది.

ఇది జ‌రిగిన కొన్నాళ్ల‌కు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఓ కార్య‌క్ర‌మంలో మాట్లా డుతూ.. “స‌మాజంలో ఉన్న‌త‌స్థానంలో ఉన్న వారికి.. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కూడా పోలీసుల వేధింపులు త‌ప్పడం లేదు. వారిపైనా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఠాణాల్లో మాన‌వ హ‌క్కుల‌కు అడుగ‌డుగునా భంగం వాటిల్లుతోంది!” అని పేర్కొన్నారు. వాస్త‌వానికి సీజే ఎవ‌రిని ఉద్దేశించి అన్నారో తెలియ‌దు. కానీ, వైసీపీలో మాత్రం క‌ల‌క‌లం రేగింది. కొన్నాళ్ల కింద‌ట‌.. ఎంపీ ర‌ఘురామ‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం.. ఆయ‌నేమో.. త‌న‌ను కొట్టార‌ని ఆరోపించ‌డం తెలిసిందే. దీంతో ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలోనే అలాంటి వ్యాఖ్య‌లు వ‌చ్చాయా ? అని వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుకున్నారు.

ఇక‌, తాజాగా.. ఛ‌త్తీస్‌గ‌డ్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌.. పోలీస్ అధికారిపై అక్క‌డి ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసింది. ఆయ‌న‌పై ఏకంగా దేశ‌ద్రోహం కేసును న‌మోదు చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే పోలీసులు.. త‌ర్వాత కాలంలో ప్ర‌భుత్వాల ఆగ్ర‌హానికి గుర‌వుతున్నార‌ని పేర్కొంది. అంతే! ఈ వ్యాఖ్య‌ల ప‌ర్య‌వసానం కూడా వైసీపీలో క‌నిపించింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉదంతాన్ని నాయ‌కులు గుర్తు చేసుకుని.. “ఆ కామెంట్లు మ‌న గురించేనంటావా? ” అంటూ.. పెద‌వులు విరుచుకున్నారు. ఇదీ సంగ‌తి!! మున్ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో!!

This post was last modified on August 28, 2021 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

21 minutes ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

1 hour ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

5 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

5 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

9 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

9 hours ago