ఏపీ అధికార పార్టీ వైసీపీలో ముందస్తు కోయిల కూస్తోంది. వచ్చే ఏడాదిలోనే సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తారనే వాదనను వైసీపీ నేతలు బహిరంగంగానే చేస్తున్నారు. అయితే.. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా ? లేక నిజంగానే జగన్ ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారా ? అనేది సందేహం. ప్రస్తుతం రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు (జగన్ మినహా). అయితే.. వీరిలో సగానికి సగం మంది.. సొంత కార్యక్రమాలు, వ్యాపారాలు అజెండాలు అమలు చేసుకుంటున్నారు తప్ప.. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్న వారు చాలా తక్కువగా ఉన్నారు.
వీరిని కట్టడి చేసేందుకు, లైన్లో పెట్టేందుకు.. ఇప్పటికే చాలా సార్లు.. సీఎం జగన్ ప్రయత్నించారు. అయితే.. ఎక్కడా కఠినంగా మాట్లాడలేదు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం.. లబ్ధిదారులకు న్యాయం చేయండి.. నియోజకవర్గాల్లో ఉండండి అని మాత్రమే ఆయన చెబుతున్నారు. అయితే.. ఇవి విన్నవారు వింటున్నారు. లేనివారు లేదు. సో.. ఈ క్రమంలో ఇలాంటి వారిని లైన్లో పెట్టాలంటే.. ఖచ్చితంగా.. ఏదో ఒక వ్యూహంతోనే ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ‘ముందస్తు’ అనే ప్రచారం తీసుకువచ్చారా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి.
పోనీ.. ఈ విషయాన్ని పక్కన పెట్టినా.. ప్రస్తుతం జగన్ సర్కారుపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను కట్టడి చేయడంలో భాగంగా.. ముందస్తును చర్చనీయాంశంగా మార్చారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోం ది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని.. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అవకాశం లేకపోలేదని.. వైసీపీ ఎంపీ రఘురామరాజు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఆర్థిక అరాచకాలు’ అనే టైటిల్తో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి నుంచి తప్పించుకునేందుకు ముందస్తును తెచ్చి.. చర్చను అటువైపు మళ్లించారా? అనే సందేహాలు వస్తున్నాయి.
పోనీ.. ముందస్తు నిజమే అనుకున్నా.. జగన్ ప్రభుత్వం ఏర్పడి.. ఇంకా రెండున్నరేళ్లు కూడా పూర్తికాలేదు. పోనీ.. ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందా? అంటే.. అది కూడా లేదు. సాధారణంగా ఏ ప్రభుత్వంపైనైనా.. ప్రతిపక్షాలు చేసే విమర్శలే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి.. తప్ప.. ప్రత్యేకంగా ఏమీ లేదు. నిజానికి ఇప్పటికే చాలా రరాష్ట్రాలు.. అప్పుల్లో ఉన్నాయి. ఇటీవల.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ జాబితాలో పంజాబ్.. తదితర రాష్ట్రాలు ముందున్నాయని చెప్పింది. ఇక, తెలంగాణ కూడా ఈ వరుసలోనే ఉంది. మరి.. ఇలాంటివి కామనే అయినప్పుడు.. ముందస్తుకు అవకాశం లేదు. అయినప్పటికీ.. వైసీపీ నేతలు ఓ వర్గం మీడియాకు క్లూలిస్తూ.. ముందస్తుపై తీవ్ర ప్రచారం చేస్తున్నారు. సో.. దీనిని బట్టి అనుమానాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం.
This post was last modified on August 27, 2021 8:12 am
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…