Political News

టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు డెడ్ లైన్‌.. !

రాష్ట్రంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పార్టీ బ‌లంగానే ఉంది. నాయకులు కూడా బ‌ల‌మైన నాయ‌కులే ఉన్నారు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. పార్టీ గెలుపుగుర్రం ఎక్కుతుం దా ? అనేదే ఇప్పుడు డౌట్‌..! గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింది. అయితే.. అదంతా జ‌గ‌న్ సునామీ వ‌ల్ల‌.. ఒక్క‌ఛాన్స్ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టంగా.. టీడీపీ చెబుతోంది. అంటే త‌మ బ‌లం త‌రిగిపోలేద‌ని.. ప్ర‌జ‌లు మాకు న‌వ్యాంధ్ర‌లో ఒక్క‌ఛాన్స్ ఎలా అయితే.. ఇచ్చారో.. అదేవిధంగా జ‌గ‌న్‌కు కూడా ఇచ్చార‌ని.. కాబ‌ట్టి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ప్ర‌జ‌లు త‌మ‌ను ఎన్నుకుంటార‌ని.. టీడీపీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇంత‌వ‌రకే కాదు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ గ్రాఫ్ ను స‌మీక్షించుకు న్నారు. ఈ క్ర‌మంలో జిల్లాల వారీగా చూసుకుంటే.. తూర్పుగోదావ‌రిలోని 16 నియోజ‌వ‌క‌ర్గాల్లో 10 చోట్ల టీడీపీ బ‌లంగా ఉంది, అదే స‌మ‌యంలో ప‌శ్చిమ‌లోనూ స‌గం పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గ్రాఫ్ కొన‌సాగుతోంది. ఇక‌, అనంత‌పురంలోనూ పార్టీ గ్రాఫ్ బాగుంది. కృష్ణా, గుంటూరుల్లో పార్టీ నేత‌లు బ‌లంగానే ఉన్నారు. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ.. పార్టీ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగానే ఉంది. అయితే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీని న‌డిపించేవారు బ‌ల‌హీనంగా ఉండ‌డం చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింది.

అంటే క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రిస్థితి బాగున్నా పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్న‌వారు కొంద‌రు.. మాత్రం లోపాయికారీగా.. అధికార పార్టీ నేత‌ల‌తో చేతులు క‌లిపార‌ని చంద్ర‌బాబు గుర్తించారు. దీనికి కూడా కార‌ణాల‌ను ఆయ‌న అన్వేషించిన‌ట్టు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో.. ముక్కోణ‌పు పోటీ జ‌రిగింది. అంటే.. వైసీపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో ఈ పోటీని త‌ట్టుకుని గెలుపు గుర్రం ఎక్కేందుకు.. టీడీపీ నాయ‌కులు.. బాగానే ఖ‌ర్చు చేశారు. కొంద‌రు సొంత ఆస్తుల‌ను కూడా అమ్ముకున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే వారంతా కూడా ఓడిపోయారు.

దీంతో వారు ఈ అప్పులు పూడ్చుకునే క్ర‌మంలో కొంత రాజీ ప‌డుతున్నార‌ని.. చంద్ర‌బాబుకు తెలిసింది. ఇక మ‌రి కొంద‌రు నేత‌లు త‌మ ప‌నులు కావ‌డం లేద‌ని లోపాయికారిగా అధికార పార్టీ నేత‌ల‌కు స‌హ‌క‌రిస్తున్నారు. దీంతో పార్టీ కోసం పోరాడే అస‌లు సిస‌లైన కార్య‌క‌ర్త‌లు త‌గ్గిపోతున్నారు. వీళ్ల‌ను బ‌ట్టే ఓట‌ర్లు కూడా వైసీపీ వైపు ట‌ర్న్ అవుతున్నారు. దీంతో వారంద‌రికీ .. ఆయ‌న 6 నెల‌ల‌ పాటు డెడ్‌లైన్ విధించార‌ని.. ఏడాది త‌ర్వాత పార్టీని యాక్టివేట్ చేయాల‌ని ష‌ర‌తు విధించార‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

Satya

Recent Posts

`అన్న‌లు` లేని లోటు తీరుస్తాం: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

1 minute ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

6 minutes ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

39 minutes ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

1 hour ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

2 hours ago

హోమంత్రి కట్టుబొట్టుపై వ్యాఖ్యలు.. ఎవరూ సహించరు

రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…

2 hours ago