రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నడుస్తున్న నీటి లొల్లి తెలిసిందే. తమకు హక్కుగా వచ్చే వాటిని తప్పించి.. తమకు సంబంధం లేని వాటాను వినియోగించుకోవాలన్న ఆలోచన లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
అదే సమయంలో తెలంగాణ విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెబుతున్న సీమఎత్తిపోతలకు సంబంధించి సీఎం కేసీఆర్ ధీమా మరోలా ఉంది. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడతామని.. ఏపీ సర్కారు ఏం చేస్తుందో తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్ర మాజీ ఇంజనీర్ల సంఘం తెర మీదకు వచ్చింది.
ఏపీ సర్కారు తాజాగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అమల్లోకి వస్తే జరిగే నష్టాన్ని వారు నివేదిక రూపంలో సీఎం కేసీఆర్ ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి? అన్న అంశానికి సంబంధించిన ప్లాన్ ఒకటి సిద్ధం చేశారు. అందులో పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి ఏమంటే?
రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర ప్రాజెక్టులతో కలిపి శ్రీశైలం నుంచి రోజుకు 17.5 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశం ఉందన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డు.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్.. సుప్రీంలను ఆశ్రయించాలని వారు సూచన చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కారణంగా బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతలను 80వరద రోజుల్లో 25 టీఎంసీలు తీసుకెళ్లేలా చేపట్టారని.. ఆయుకట్టను 2.5లక్షల నుంచి నాలుగు లక్షల ఎకరాలకు పెంచారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని నలభై టీఎంసీలకు పెంచాలన్నారు. దీనికి తగ్గట్లే మౌలికసదుపాయాలు కల్పించాలని చెప్పిన వారు పది టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మించాలన్నారు.
జూరాల పునరుజ్జీవ పథకం ప్రతిపాదనతో పాటు.. శ్రీశైలం ఎడమగట్టుకాలువ సొరంగ మార్గాన్ని వెంటనే పూర్తి చేయాలి. నెట్టెంపాడు సమీపంలో 20 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ – నల్గొండ.. రంగారెడ్డి జిల్లాల అవసరాల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రోజుకు 2.7 లేదంటే మూడు టీఎంసీల నీరు తీసుకునేలా ప్లాన్ చేయాలి. మరీ.. సూచనలకు సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
This post was last modified on May 28, 2020 12:33 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…