ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు, వెళ్ళిపోవడానికి గడువు పొడిగించే సమస్యే లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. అమెరికా, ఇంగ్లాండ్ తో పాటు నాటో దళాలు దేశాన్ని విడిచిపెట్టడానికి గతంలో నిర్ణయించుకున్న ఆగస్టు 31 డెడ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించేది లేదని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తేల్చిచెప్పారు. ఒకవేళ గడువు దాటినా దేశం విడిచి వెళ్ళని దళాలకు ఏదైనా జరిగితే దాని బాధ్యత తమది కాదని కూడా తాలిబన్లు హెచ్చరించటం ఆశ్చర్యంగా ఉంది.
గడువు దాటిన తర్వాత కూడా అమెరికా, ఇంగ్లాండ్ సైనిక దళాలు దేశాన్ని విడిచి పెట్టకపోతే ఆఫ్ఘన్ పై దురాక్రమణ చేయడంగా భావిస్తామని తాలిబన్లు ప్రకటించారు. విచిత్రమేమిటంటే తాలిబన్లు చేసిందే ఆక్రమణ. మళ్ళీ రివర్స్ లో అమెరికా దళాలను ఆక్రమణదారులుగా పరిగణిస్తామంటు హెచ్చరికలొకటి. డెడ్ లైన్ రెడ్ లైన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని ప్రకటించటాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.
ఏకంగా అమెరికాకే తాలిబన్లు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారా ? అనే సందేహాలు మొదలైనాయి. నిజంగానే అమెరికా సైన్యం దేశంలోనే ఉండాలని అనుకుంటే తాలిబన్లు చేయగలిగిందేమీ లేదు. కాకపోతే చిన్నపాటి ప్రతిఘటన తప్పదంతే. అయితే తాలిబన్ల బెదిరింపుల వెనుక అమెరికా చేసిన తప్పిదమే స్పష్టంగా కనిపిస్తోంది. అదేమిటంటే అపారమైన, అత్యాధునికమైన ఆయుధాలను తాలిబన్ల పరం చేయటమే.
అనాలోచితంగా అమెరికా చేసిన తప్పు వల్ల అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, ఎం 16, ఎం 16 ఏ లాంటి అత్యంత అధునాతన ఆయుధాలు తాలిబన్ల చేతుల్లో పడ్డాయి. వీటితో పాటు వందలాది అస్సాల్ట్ రైఫిల్స్ తో పాటు 70 టన్నుల ఆయుధ సామగ్రిని తాలిబన్లు సొంతం చేసేసుకున్నారు. ఇవి కాకుండా పర్వతాలు, లోయలు, ఎడారుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణం చేయగలిగిన సుమారు 700 వాహనాలను కూడా తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. ఈ ధైర్యంతోనే తాలిబన్లు అమెరికాకే డెడ్ లైన్ విధిస్తున్నారు.
This post was last modified on August 24, 2021 10:53 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…