రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డే పవర్ ఫుల్ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టంగా చెప్పారు. జగన్ పై జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసిందని ఇండియా టు డే ప్రచురించిన మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేవీపీ మాట్లాడుతూ ఆ సర్వేని కొట్టిపారేశారు. మీడియాతో కేవీపీ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే జగనే చాలా పవర్ ఫుల్ అని తేల్చేశారు. జగన్ ను సవాలు చేసే స్ధితిలో ఏ ప్రతిపక్షం కూడా లేదన్న విషయాన్ని కేవీపీ గుర్తుచేశారు.
అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ పాలనపైనే జనాలందరూ పాజిటివ్ గా ఉన్నారని చెప్పారు. ఒకపుడు దివంగత వైఎస్సార్ పైన కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్ పాలన పైన కూడా అప్పట్లో ప్రతిపక్షాలు, మీడియా ఎంత దుమ్మెత్తిపోసినా రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని కేవీపీ గుర్తుచేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో తాను చెప్పలేనని అన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మధ్యనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని ఆరుగురు సీనియర్ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. 2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అందుకు తగ్గట్టుగా నేతలు వేదికను ఏర్పాటు చేయాలని రాహుల్ ఆదేశించారు. కాంగ్రెస్ నుండి ఇతర పార్టీల్లోకి ప్రధానంగా వైసీపీలోకి వెళ్లిపోయిన నేతలను వెనక్కి పిలిపించాలని, వైసీపీ ఓటు బ్యాంకును తిరిగి తీసుకోవాలని రాహుల్ గట్టిగా చెప్పారు.
మరి ఆ భేటీలో రాహుల్ తో ఎవరు ఏమి చెప్పారో తెలీదు కానీ తాజాగా కేవీపీ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జగన్ పాపులారిటీ, పవర్ గురించి నేరుగా మీడియాతోనే ప్రస్తావించారంటే కేవీపీ మనసులోని మాటనే బయటపెట్టారని అనుకోవాలి.
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…