Political News

అఫ్గన్ ఇల్లు కాలుతుంటే చైనా చలికాచుకుంటోంది

పొరుగునే ఉన్న ఆప్ఘనిస్థాన్లో పరిణామాలతో డ్రాగన్ పిచ్చ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆప్ఘన్లో ఉన్న ఖనిజాలపై చైనా ఎప్పటినుండో కన్నేసింది. అయితే ఖనిజాలను సొంతం చేసుకోవడం ఇంతకాలం డ్రాగన్ కు సాధ్యం కాలేదు. గతంలోనే ఖనిజాల మైనింగ్ కు చైనా ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల తవ్వకాలు సాధ్యంకాలేదు. అలాంటిది ఇపుడు ఆ ఒప్పందాలన్నీ స్పీడవుతున్నాయి. అష్రఫ్ ఘనీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ దేశంలో చైనా ఏకపక్షంగా పనులు చేయించుకోవడం సాధ్యం కాలేదు.

తాజా పరిణామాలతో దేశాధిపత్యాన్ని తాలిబన్లు లాగేసుకోవటంతో చైనా మంచి హుషారుగా ఉంది. ఈ దేశంలోని తాజా పరిణామాల వెనుక పాకిస్తాన్, డ్రాగన్లు ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆప్ఘన్లో రేర్ ఎర్త్ అనే ఖనిజం ఉంది. లక్షల టన్నుల ఈ ఖనిజంపై చైనా చాలా కాలం క్రితమే కన్నేసింది. అయితే వాటిని సొంతం చేసుకోవడానికి అవకాశాలు మాత్రం రాలేదు. కాకపోతే ప్రభుత్వంతో ఒప్పందలైతే చేసుకున్నదంతే.

ఆఫ్ఘన్-చైనా మధ్య 50 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దు బదక్షాన్ ప్రావిన్స్ లోని నజాక్-చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ మధ్య రాకపోకలకు విశాలమైన రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 20 శాతం పనులు పూర్తయ్యాయి. ఏదో కారణంతో నిర్మాణ పనులు అనుకున్నంత స్పీడుగా జరగడం లేదు. తాజా పరిణామాల్లో తాలిబన్లు రోడ్డు నిర్మాణ పనులు స్పీడుగా జరగాలని అనుకుంటున్నారట. అంటే ఈ నిర్ణయం వెనుక చైనా పాలకులే ఉన్నారన్న విషయం అర్థమవుతోంది.

రేర్ ఎర్త్ ఖనిజాన్ని కంప్యూటర్లు, రీచార్జి బ్యాటరీలు, విండ్ పవర్, బర్బైన్లు, హైబ్రీడ్ కార్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిజానికి ఈ ఖనిజం యావత్ ప్రపంచ దేశాలకు చాలా అవసరం. ప్రస్తుత నేపథ్యంలో చైనాకు మాత్రమే ఖనిజ నిక్షేపాలు తవ్వుకునే అవకాశాలు దొరుకుతాయని అనుమానిస్తున్నారు. తొందరలోనే తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, రెండు ప్రావిన్సుల మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయిపోతే చైనా పిచ్చ హ్యాపీనే.

This post was last modified on August 22, 2021 12:45 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

19 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago