అద్దేపల్లి శ్రీధర్.. ఒకప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా బాగానే పాపులారిటీ సంపాదించిన నేత. టీవీ చర్చల్లో జనసేన గళం బాగానే వినిపించాడాయన. ఐతే గత ఏడాది ఎన్నికల్లో జనసేన ఘోర పరాభవం చవిచూడటంతో ఆయన రూటు మారింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పట్నుంచి ఆయన వైసీపీ తరఫున గళం వినిపిస్తున్నారు. జనసేన, టీడీపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే వైసీపీలో ఆయనకు తగినంత ప్రాధాన్యం అయితే కనిపించట్లేదు. అక్కడ సొంత గుర్తింపంటూ ఏమీ లేకపోయింది. వైసీపీ పార్టీ కార్యకర్తల మద్దతు ఆయనకు అంతంతమాత్రంగానే ఉంటోంది.
పవన్కు నమ్మకద్రోహం చేశాడంటూ జనసైనికులు ఆయనపై తరచుగా దాడి చేస్తుంటారు. కౌంటర్ చేస్తుంటారు. వారి దాడిని కాచుకోవడానికే ఆయన ఆపసోపాలు పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఒక కామెంట్తో అద్దేపల్లి శ్రీధర్ వైసీపీ అభిమానులు ఆయనకు యాంటీ అయిపోయారు.
వరుసగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్న హైకోర్టుపై.. వైకాపా నాయకులతో పాటు సోషల్ మీడియాలో ఆ పార్టీ అభిమానులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, వారికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయడం తెలిసిన సంగతే. దీనిపై జరిగిన ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న అద్దేపల్లి శ్రీధర్.. ఈ వ్యవహారం తీవ్రత తగ్గించే ప్రయత్నం చేశారు. ఇలా నోటీసులు అందుకున్న 49 మందిలో 98 శాతం మంది ఇల్లిటరేట్స్ అని.. వాళ్లకు మీడియా ముందు,
సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలి.. ఏం రాయాలి అన్నది తెలియదని.. వ్యాఖ్యానించారు. ఐతే కోర్టు వ్యవహారాలు తెలియక తప్పు చేశారంటూ వైకాపా అభిమానుల్ని వెనకేసుకునే ప్రయత్నమే చేశారు కానీ… ఇల్లిటరేట్స్ అనే పదం వాడటంతో నోటీసులందుకున్న వారికి మండిపోయింది. తమను ఇల్లిటరేట్స్ అంటారా ఆయనపై ఎదురుదాడి చేస్తూ బూతులు తిడుతున్నారు. ఈ విషయంలో వైకాపా వాళ్లతోనే అద్దేపల్లి ట్విట్టర్లో యుద్ధం చేయాల్సి వస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నుంచి ఇలాంటి వ్యతిరేకత వస్తుందని అద్దేపల్లి ఊహించి ఉండడు.
This post was last modified on May 28, 2020 3:25 am
మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు…
లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ విషయం పెరిగి పెద్దదై…
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…
అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…