Political News

బ‌య‌ట విమ‌ర్శ‌లు.. ఇంటికెళ్లి స‌మావేశాలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ బ‌లోపేతం దిశ‌గా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి జ‌నఆశీర్వాద్ యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం ఏపీలోని తిరుప‌తి, విజ‌య‌వాడ‌ల్లో ప్ర‌సంగించారు. ఆ సంద‌ర్భంగా ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త కార‌ణంగానే రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారింద‌ని విమ‌ర్శించారు. ఆ రాష్ట్రంలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. ఇలా బ‌య‌ట ప్ర‌సంగాల్లో అధికార ప్ర‌భుత్వాన్ని తిట్టిపోసిన కిష‌న్ రెడ్డి.. ఆ త‌ర్వాత అనూహ్యంగా సీఏం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డంతో అంద‌రూ విస్తుపోయారు.

విజ‌య‌వాడ‌లో ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న త‌ర్వాత కిష‌న్ రెడ్డి నేరుగా జ‌గ‌న్ ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌తో జ‌గ‌న్‌తో స‌మావేశ‌మ‌వుతార‌నే విష‌యం ఏపీ బీజేపీ నేత‌ల‌కే తెలీద‌ని స‌మాచారం. అప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌తో ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌ను ఈ భేటీకి రానీవ‌కుండా ప‌క్క‌న పెట్టారు. మ‌రి ఇలా ర‌హ‌స్యంగా జ‌గ‌న్ ఇంటికి వెళ్లాల్సిన అవ‌స‌రం కిష‌న్ రెడ్డికి ఏముంద‌నే చ‌ర్చ ఇప్పుడు జోరంద‌కుంది. ఎందుకంటే కేంద్ర‌మంత్రి అయిన ఆయ‌న అధికారిక ప‌ర్య‌ట‌న కోసం రాష్ట్రానికి రాలేదు. జ‌న ఆశీర్వాద్ పేరుతో పార్టీని బ‌లోపేతం చేసే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. మ‌రి పార్టీ కార్య‌క్ర‌మం కోసం వ‌చ్చిన ఆయ‌న సీఎం జ‌గ‌న్‌తో మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఎందుకు భేటీ అయ్యారు? ఆ అవ‌స‌రం ఎందుక వ‌చ్చింద‌నేది రాష్ట్ర బీజేపీ వ‌ర్గాల్లో ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఓ వైపు కేంద్రంలోని అధికార బీజేపీని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి కార‌ణంగానే రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారింద‌ని త‌మ ప్ర‌భుత్వాన్ని కూల‌దోల్చ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అస‌లు రాష్ట్రంలో పెద్ద‌గా బ‌లం లేని బీజేపీకి వైసీపీ అన‌వ‌స‌రంగా మార్కెట్ క‌ల్పిస్తుంద‌ని ఇప్ప‌టికే అభిప్రాయాలున్నాయి.

ఇక ఇప్పుడు జ‌గ‌న్‌ను కిష‌న్ రెడ్డి క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రోవైపు ఏపీ బీజేపీ నేత‌ల‌ను మ‌రింత గంద‌ర‌గోళంలోకి నెట్టేసింది. ఇలా రాష్ట్రంలోని ఆ పార్టీ శ్రేణుల‌ను అయోమ‌యంలోకి నెట్టేయ‌డం కోసం కిష‌న్ రెడ్డిని జ‌గ‌న్ విందుకు ఆహ్వానించార‌ని అంటున్నారు. అయితే ఏదేమైనా ఎలాంటి ప్ర‌యోజ‌నాలు లేకుండా ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఏమీ జ‌ర‌గ‌ద‌నేది బహిరంగ ర‌హ‌స్య‌మే. అలాంటిది ఇప్పుడీ ఇద్దరి భేటీ వెన‌క కూడా ఏదో ఓ కార‌ణం ఉండే ఉంటుంది. ఎప్పుడోసారి అది బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

This post was last modified on August 20, 2021 3:06 pm

Share

Recent Posts

హిట్టు కొట్టాడు… మాయమైపోయాడు

టాలీవుడ్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా చాలామంది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్టు కోసం ప్రయత్నం ఆపట్లేదు.…

35 minutes ago

యాక్షన్ కు రియాక్షన్ – తాట తీసిన పోలీసులు

రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…

3 hours ago

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

10 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

11 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

11 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

12 hours ago