తెలంగాణ రాజకీయాల్లో సత్తాచాటేందుకు వైస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆమె ఆశలన్నీ ఆదిలోనే అడియాశలు అవుతున్నాయి. ఆమె పార్టీ ప్రారంభించి కనీసం జనాల్లోకి కూడా పూర్తిగా వెళ్లకముందే ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
వైస్ షర్మిల పెట్టిన కొత్త పార్టీ కి సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేస్తూ… రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజల అభిష్టం మేరకే వైఎస్ఆర్టీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇందిరా శోభన్.
“షర్మిల వైఎస్ఆర్ టీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుణ పడి ఉంటాను. అభి మానులు, తెలంగాణ ప్రజల కోరిక మేర కే ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను.” అని ఇందిరా శోభ పేర్కొన్నారు. కాగా… కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఇందిరా శోభన్… ఇటీవలే వైఎస్ షర్మిల పార్టీలో చేరారు. పార్టీ ప్రతిపాదన తెచ్చినప్పటి నుంచి… వైఎస్ షర్మిల వెంట ఇందిరా శోభన్ ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 20, 2021 12:23 pm
కెజిఎఫ్ తర్వాత సరైన అవకాశాలు రాక, వచ్చినా కోబ్రా లాంటివి ఆశించిన స్థాయిలో ఆడలేక ఇబ్బంది పడుతున్న శ్రీనిధి శెట్టికి…
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార వచ్చి మూడేళ్లు దాటింది. ఆ తర్వాత…
తెలంగాణ ఏర్పాటై తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాక కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్.…
కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య తండ్రి శివకుమార్ మాట్లాడుతూ కోలీవుడ్…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన అనుష్క శెట్టి అనుకున్న ప్రకారం అన్నీ జరిగి…
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం…