Political News

టీడీపీ, జనసేన ఒకటవుతున్నాయా ?

తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం ప్రకారం రాబోయే కాలంలో మళ్ళీ టీడీపీ, జనసేన ఒకటవబోతున్నాయట. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కుదేలైపోయాయి. తెలుగుదేశం పార్టీకన్నా 23 ఎంఎల్ఏ, 3 ఎంపీ సీట్లు దక్కాయి. మిగిలిన కాంగ్రెస్, బీజేపీ, జనసేనకు ఏమీ దక్కలేదు. జనసేన తరపున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలిచారు కానీ ఆయన కూడా వైసీపీ నేతే.

రాజోలు నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేయటానికి టికెట్ దక్కకపోతే చివరి నిముషంలో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కాబట్టి జనాలు ఆయన వైసీపీ నేతగానే చూసి ఓట్లేసి గెలిపించుకున్నారు. అంతేకానీ జనసేన నేతగా చూడలేదన్నది వాస్తవం. అందుకనే రాపాక సాంకేతికంగా తాను జనసేన ఎంఎల్ఏనే అయినా వైసీపీ ఎంఎల్ఏగా ఐడెంటిఫై అవ్వటానికే ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

సరే ప్రస్తుత విషయానికి వస్తే బీజేపీ+జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ ఎప్పుడూ కలిసి పనిచేసిందేమీలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన నిరసన కార్యక్రమాల్లో కూడా జనసేన నేతలను కలుపుకున్నదిలేదు. చివరకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మీడియా సమావేశాల్లో కూడా జనసేన నేతలు ఎక్కడా కనబడరు. నిజానికి జనసేన వల్ల బీజేపీకి ఏమన్నా లాభం ఉంటుందేమో కానీ బీజేపీ వల్ల జనసేనకు వచ్చే లాభం ఏమీ లేదు.

పైగా కేంద్రంలో నరేంద్ర మోడీ పై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేసేది అనుమానంగా మారింది. మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు దేనికదే పోటీ చేసింది. కొన్నిచోట్ల జనసేన+టీడీపీ కలిసి పోటీ చేశాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నట్లు సమాచారం. బీజేపీతో కలిసి పోటీ చేయడం కన్నా టీడీపీతో చేతులు కలపటం వల్లే ఉపయోగం ఉంటుందని జనసేన ముఖ్యనేతలు పవన్ కు చెప్పారట.

పార్టీలోని సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే పవన్ తో గట్టిగా చెప్పారట. పవన్ తో కలిసి పనిచేయటానికి చంద్రబాబునాయుడుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కాబట్టి రెండుపార్టీలు మళ్ళీ కలవటంలో టీడీపీ నుండి ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టే పొత్తుల విషయాన్ని రెండుపార్టీల నేతలు సమయం వచ్చినపుడు బహిరంగపరచాలని అనుకున్నట్లు టీడీపీ సన్నిహితవర్గాలు చెప్పాయి. క్షేత్ర స్ధాయిలో రెండు పార్టీల్లోని గ్రౌండ్ రియాలిటీ చూసిన తర్వాత తొందరలోనే ప్రకటన ఉంటుందేమో చూడాలి.

This post was last modified on August 20, 2021 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago