ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించేశారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ ని ఆక్రమించుకున్నారనే విషయం తెలియగానే.. దేశ ప్రజలు భయంతో వణికిపోయారు.
ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆఖరికి విమానాల పైకి ఎక్కి మరీ ప్రయాణం చేశారు. అలా అమెరికా సైనిక విమానం పట్టుకుని వేలాడి ముగ్గురు చనిపోయారు. వారిలో ఆఫ్ఘాన్ యువ ఫుట్ బాల్ ఆటగాడు జకీ అన్వారీ కూడా ఉండటం గమనార్హం.
19 ఏళ్ల అన్వారీ కాబూల్ లోని ఎస్తెఘ్ లాల్ స్కూల్ లో చదువుతున్నాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ యూత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్ బాల్ మీద ప్రేమ.. తాలిబన్ల చేతిలో బలవ్వకూడదన్న భయం.. అతడ్ని విమానం పైకి ఎక్కేలా చేశాయి. ఆరోజు సీ-17 ల్యాండింగ్ పరికరాలపైకి ఎక్కి దేశాన్ని వీడాలని భావించి… విమానం గాల్లోకి లేవగానే అక్కడి నుంచి జారిపడి చనిపోయాడు.
విమానం గాల్లో ఉండగా… అక్కడి నుంచి ముగ్గురు వ్యక్తులు జారి పడిన వీడియో ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
This post was last modified on August 20, 2021 11:29 am
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…