ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించేశారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ ని ఆక్రమించుకున్నారనే విషయం తెలియగానే.. దేశ ప్రజలు భయంతో వణికిపోయారు.
ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆఖరికి విమానాల పైకి ఎక్కి మరీ ప్రయాణం చేశారు. అలా అమెరికా సైనిక విమానం పట్టుకుని వేలాడి ముగ్గురు చనిపోయారు. వారిలో ఆఫ్ఘాన్ యువ ఫుట్ బాల్ ఆటగాడు జకీ అన్వారీ కూడా ఉండటం గమనార్హం.
19 ఏళ్ల అన్వారీ కాబూల్ లోని ఎస్తెఘ్ లాల్ స్కూల్ లో చదువుతున్నాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ యూత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్ బాల్ మీద ప్రేమ.. తాలిబన్ల చేతిలో బలవ్వకూడదన్న భయం.. అతడ్ని విమానం పైకి ఎక్కేలా చేశాయి. ఆరోజు సీ-17 ల్యాండింగ్ పరికరాలపైకి ఎక్కి దేశాన్ని వీడాలని భావించి… విమానం గాల్లోకి లేవగానే అక్కడి నుంచి జారిపడి చనిపోయాడు.
విమానం గాల్లో ఉండగా… అక్కడి నుంచి ముగ్గురు వ్యక్తులు జారి పడిన వీడియో ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
This post was last modified on August 20, 2021 11:29 am
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…