జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి ఏకంగా తెలంగాణ హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి చెక్ పెట్టినట్టు అయింది. వెంటనే సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో వ్యవహారాలు అదుపుతప్పి నడుస్తున్నందున సొసైటీ పర్యవేక్షణకు, నియంత్రణకు స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. తెలంగాణా కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్-కమ్-కమిషనర్ ను తాజాగా ఆదేశించింది.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ ఎ.మురళీముకుంద్ స్పెషలాఫీసర్ నియామకం కోరుతూ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అలాగే హౌసింగ్ సొసైటీ సెక్రటరీ అధికారాలు తొలగిస్తూ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ ఈ నెల 12 న జారీ చేసిన నోటీసు ను కూడా తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది.
అలాగే మురళీ ముకుంద్ పిటిషన్ను పరిశీలించి ప్రతివాదులైన సహకారశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సహకార సొసైటీల రిజిస్ట్రార్, జూబ్లీహిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్కు నోటీసులు జారీ చేసింది.
సొసైటీ సెక్రటరీగా తన హక్కులకు ప్రెసిడెంట్, ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు భంగం కలిగిస్తున్నారని, మీటింగ్స్కు కూడా రానివ్వడంలేదనీ, తన బాధ్యతలను నిర్వర్తించనివ్వడం లేదని పిటిషన్లో మురళీముకుంద్ పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థించిన మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయని బెంచ్ పేర్కొంది.
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…