గంటా శ్రీనివాసరావు… ఆయన ముందు విశాఖలో ఒక మీడియా సంస్థలో ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి వచ్చారు. ఇక అక్కడ నుంచి రాజకీయ నాయకులతో పరిచయాలు కావడంతో ఆ వైపుగా ఆసక్తి మళ్ళింది. అయితే ఆయన మొదట ఎంచుకున్న పార్టీ బీజేపీ కావడం విశేషం. కానీ 1999 ఎన్నికల వేళ విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన అభ్యర్ధి లేకపోవడంతో చంద్రబాబు తటస్థులకు ఛాన్స్ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు గంటా టీడీపీలో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆ ఊపులో ఆయన ఎంపీ అయిపోయారు. అంతే కేవలం అయిదేళ్ల కాలంలోనే ఆయన రాజకీయంగా పట్టు సాధించారు.
ఇక ఆయన కన్ను మంత్రి పదవి మీద పడింది. అందుకే పట్టుబట్టి మరీ 2004 ఎన్నికల్లో ఆయన విశాఖ జిల్లా చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. కానీ టీడీపీ ఏపీలో ఓడింది. ఇక 2009 నాటికి ప్రజారాజ్యంలో చేరారు. ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా కోరిక 2012 నాటికి నెరవేరింది. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు తొలిసారిగా నిర్వహించారు. ఆ తరువాత 2014 నాటికి చంద్రబాబు పిలుపు మేరకు మళ్ళీ టీడీపీలో చేరిన గంటా అక్కడ కూడా అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు.
మొత్తానికి రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏడేళ్ల పాటు మంత్రిగా చేసిన గంటా 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచి విపక్షంలోకి వచ్చేశారు.
గత రెండేళ్ళుగా అసలు ఎక్కడా కనిపించడంలేదు. ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీలో యాక్టివిటీ లేదు. వైసీపీలో ఆయన చేరేందుకు ఎన్నో షరతులు వర్తిస్తాయని బోర్డు పెట్టేశారు. దాంతో గంటా రాజకీయం అయోమయంలో పడింది. గంటా వంటి డైనమిక్ లీడర్ పొలిటికల్ కెరీర్ మొత్తం రెండు దశాబ్దాల పాటు దూకుడుగా సాగింది కానీ ఇపుడు మాత్రం మసకబారింది అనే చెప్పాలి.
ఆయన 2024 నాటికి ఏ పార్టీలో చేరుతారు అన్నది ఎవరికీ తెలియదు. మరో వైపు ఆయనకు వెన్నంటి ఉన్న అనుచరులు అంతా కూడా వైసీపీలో చేరిపోయారు. దాంతో గంటా ఒంటరి వారు అయ్యారు. టీడీపీలో కనీసం పార్టీ పదవులు కూడా గంటాను వరించలేదు. చంద్రబాబు, లోకేష్ ఆయనను పక్కన పెట్టేశారు. టీడీపీలో ఉన్నా పోటీ చేసేందుకు సీటు కూడా లేదు అంటున్నారు. దీంతో గంటా పాలిటిక్స్ రిస్క్ లో పడిందనే అంటున్నారు.
అయితే గంటా రాజకీయ చాతుర్యం గొప్పది. 2024 నాటికి ఆయన ఏదో విధంగా మ్యాజిక్ చేసి గెలిచే పార్టీలో ఉంటారని మళ్లీ మంత్రి అవుతారని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఆయన గెలిచే పార్టీ అంటే ఎందులో ఉంటారో. ఏ రకమైన రాజకీయం చేస్తారో..?
This post was last modified on August 19, 2021 2:57 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…