Political News

రెండు ద‌శాబ్దాల రాజ‌కీయంలో గంటాకు తొలిసారి ఎంత క‌ష్టం ?


గంటా శ్రీనివాస‌రావు… ఆయన ముందు విశాఖలో ఒక మీడియా సంస్థలో ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి వచ్చారు. ఇక అక్కడ నుంచి రాజకీయ నాయకులతో పరిచయాలు కావడంతో ఆ వైపుగా ఆసక్తి మళ్ళింది. అయితే ఆయన మొదట ఎంచుకున్న పార్టీ బీజేపీ కావడం విశేషం. కానీ 1999 ఎన్నికల వేళ విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన అభ్యర్ధి లేకపోవడంతో చంద్రబాబు తటస్థులకు ఛాన్స్ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు గంటా టీడీపీలో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆ ఊపులో ఆయన ఎంపీ అయిపోయారు. అంతే కేవలం అయిదేళ్ల కాలంలోనే ఆయన రాజకీయంగా పట్టు సాధించారు.

ఇక ఆయన కన్ను మంత్రి పదవి మీద పడింది. అందుకే పట్టుబట్టి మరీ 2004 ఎన్నికల్లో ఆయన విశాఖ జిల్లా చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. కానీ టీడీపీ ఏపీలో ఓడింది. ఇక 2009 నాటికి ప్రజారాజ్యంలో చేరారు. ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా కోరిక 2012 నాటికి నెరవేరింది. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు తొలిసారిగా నిర్వహించారు. ఆ తరువాత 2014 నాటికి చంద్రబాబు పిలుపు మేరకు మళ్ళీ టీడీపీలో చేరిన గంటా అక్కడ కూడా అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు.

మొత్తానికి రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏడేళ్ల పాటు మంత్రిగా చేసిన గంటా 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచి విపక్షంలోకి వచ్చేశారు.


గత రెండేళ్ళుగా అసలు ఎక్కడా కనిపించడంలేదు. ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీలో యాక్టివిటీ లేదు. వైసీపీలో ఆయన చేరేందుకు ఎన్నో షరతులు వర్తిస్తాయని బోర్డు పెట్టేశారు. దాంతో గంటా రాజకీయం అయోమయంలో పడింది. గంటా వంటి డైనమిక్ లీడర్ పొలిటికల్ కెరీర్ మొత్తం రెండు దశాబ్దాల పాటు దూకుడుగా సాగింది కానీ ఇపుడు మాత్రం మసకబారింది అనే చెప్పాలి.

ఆయన 2024 నాటికి ఏ పార్టీలో చేరుతారు అన్నది ఎవరికీ తెలియదు. మరో వైపు ఆయనకు వెన్నంటి ఉన్న అనుచరులు అంతా కూడా వైసీపీలో చేరిపోయారు. దాంతో గంటా ఒంటరి వారు అయ్యారు. టీడీపీలో కనీసం పార్టీ పదవులు కూడా గంటాను వరించలేదు. చంద్రబాబు, లోకేష్ ఆయనను పక్కన పెట్టేశారు. టీడీపీలో ఉన్నా పోటీ చేసేందుకు సీటు కూడా లేదు అంటున్నారు. దీంతో గంటా పాలిటిక్స్ రిస్క్ లో పడిందనే అంటున్నారు.

అయితే గంటా రాజకీయ చాతుర్యం గొప్పది. 2024 నాటికి ఆయన ఏదో విధంగా మ్యాజిక్ చేసి గెలిచే పార్టీలో ఉంటారని మళ్లీ మంత్రి అవుతారని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఆయన గెలిచే పార్టీ అంటే ఎందులో ఉంటారో. ఏ రకమైన రాజకీయం చేస్తారో..?

This post was last modified on August 19, 2021 2:57 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago