Political News

తాలిబన్లపై తిరగబడుతున్న మహిళలు ?

ప్రపంచమంతా ఆశ్చర్యపోయే ఘటనలు ఆప్ఘనిస్థాన్లో మొదలయ్యాయా ? అవుననే అంటోంది ప్రపంచ మీడియా. తాలిబన్లకు భయపడిపోయి దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఆయనతో పాటు కొందరు మంత్రులు, గవర్నర్లు, కీలక నేతలు కూడా దేశం నుంచి మాయమైపోయారు. దేశంలో మిగిలిన సైన్యంతో పాటు మగాళ్లు కూడా తాలిబన్ల ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఇలాంటి నేపధ్యంలోనే మహిళల్లో కొందరు తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేశారనే కారణంగా జలాలాబాద్ లో ఇద్దరు మహిళలను తాలిబన్లు కాల్చి చంపేశారు.

20 ఏళ్ళపాటు అనుభవించిన స్వేచ్చా, సమానత్వం ఒక్క దెబ్బకు తాలిబన్ల రూపంలో కూలిపోవటాన్ని మహిళలు సహించలేక పోతున్నట్లు తాజా ఘటనలతో ప్రపంచానికి తెలిస్తోంది. దేశంలోని కొన్ని చోట్ల మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. తమ స్వేచ్చను హరించవద్దని, హింసాకాండకు దిగవద్దని గట్టిగా గర్జించారు. మహిళలుగా తమ హక్కులను కాలరాయద్దని రాసున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపైన నిలబడటమే ఆశ్చర్యంగా ఉంది.

తాలిబన్ల రాజ్యంలో ఒంటిమీద బురఖాలు వేసుకోకుండా అదీ మగాళ్ళ తోడులేకుండా ఆడవాళ్ళు రోడ్లపైకి రావటం నిషిద్ధం. చేతి వేళ్ళు కూడా ఆడవాళ్లు బహిరంగంగా కనబడనీయకూడదనేది తాలిబన్ల చట్టం. ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని నిర్దాక్షిణ్యంగా రోడ్లపైన ఉరి తీయటమో లేకపోతే అక్కడికక్కడే కాల్చిచంపేయటమో చేస్తారు. ఇలాంటి రాతి యుగం నాటి చట్టాలను అమలు చేస్తున్న తాలిబన్ల ముందే ఆడవాళ్ళు మొహాన్ని కప్పుకోకుండా బుధవారం గుంపులుగా రోడ్లపైన ప్లకార్డులు పట్టుకుని నిలబడటమంటే చావుకు ఎదురెళ్ళటమే.

ఈ విషయం ఆఫ్ఘనిస్థాన్లోని మహిళలకన్నా బాగా తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరుంటారు ? అయినా సరే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మగవాళ్ళు భయపడి ఇంట్లో కూర్చునుంటే ఆడవాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసలు తెలపటమంటే మామూలు విషయం కాదు. బహుశా ఈ విషయాలను తాలిబన్లు కూడా ముందే గ్రహించారేమో. అందుకనే ఆడవాళ్ళు నిర్భయంగా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళి చదువుకోవచ్చన్నారు. అవకాశం ఉన్నచోట ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చన్నారు. బురఖాలతో మొహాలు కప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఇన్ని చెప్పిన తాలిబన్లు ఒక మెలిక పెట్టారు. అదేమిటంటే తాము చెప్పినవన్నీ షరియా చట్టాలకు లోబడే అమలవుతాయని స్పష్టంచేశారు. షరియా చట్టాలంటే మళ్ళీ మహిళలకు స్వేచ్ఛ లేకపోవటమే. షరియా చట్టాల ప్రకారం మగతోడు లేకుండా ఆడవాళ్ళు బయటకు రాకూడదు, ఒళ్ళంతా కప్పుకుంటూ బురఖా వేసుకోవాల్సిందే, మత గ్రంధాలు తప్ప ఇంకేమీ చదువుకోకూడదనే చాలా నిబంధనలున్నాయి. అందుకే మహిళలు ఇపుడు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నది. మరి తాజా ఘటనలు ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సిందే.

This post was last modified on August 19, 2021 11:17 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

1 hour ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

1 hour ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

1 hour ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

3 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

4 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

5 hours ago