ఆప్ఘనిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ దేశాన్ని తాలిబాన్లు అక్రమించుకున్న సంగతి తెలిసిందే. కాగా… తాలిబన్లు రాజ్యమేలుతున్న ఆప్ఘానిస్థాన్లో ఇద్దరు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. ఉపాధి నిమిత్తం కాబుల్ వెళ్లిన మంచిర్యాల జిల్లాకు బొమ్మన రాజన్న.. గత 8 ఏళ్లుగా అక్కడే ఏసీసీఎల్ సంస్థలో పని చేస్తున్నారు. ఆప్ఘాన్లో రోజుల వ్యవధిలోనే పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో.. ఆయన ఆందోళనలో ఉన్నారు. జూన్ 28న మంచిర్యాల వచ్చిన రాజన్న.. ఆగస్టు 7నే అక్కడికి వెళ్లారు.
ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్కు తిరిగి రావడానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 18న రాజన్నను తిరిగి భారత్ పంపేందుకు ఆయన పనిచేసే సంస్థ సైతం టికెట్లు బుక్ చేసింది. కానీ ఈలోపే రాజధాని కాబుల్ సైతం తాలిబన్ల వశమైంది.
దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆయన అక్కడే చిక్కుకుపోయారు. రాజన్నతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన పెంచల వెంకన్న సైతం ఆప్ఘాన్లోనే చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా భారతదేశానికి తీసుకెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఆప్ఘనిస్థాన్లోని పరిస్థితులను మీడియా ద్వారా తెలుసుకుంటున్న ఇరువురి కుటుంబ సభ్యులు.. వారి క్షేమ సమాచారంపై ఆందోళన చెందుతున్నారు.
This post was last modified on August 19, 2021 10:04 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…