Political News

ఆఫ్ఘాన్ లో చిక్కుకున్న తెలంగాణ యువకులు..!

ఆప్ఘనిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ దేశాన్ని తాలిబాన్లు అక్రమించుకున్న సంగతి తెలిసిందే. కాగా… తాలిబన్లు రాజ్యమేలుతున్న ఆప్ఘానిస్థాన్‌లో ఇద్దరు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. ఉపాధి నిమిత్తం కాబుల్ వెళ్లిన మంచిర్యాల జిల్లాకు బొమ్మన రాజన్న.. గత 8 ఏళ్లుగా అక్కడే ఏసీసీఎల్ సంస్థలో పని చేస్తున్నారు. ఆప్ఘాన్‌లో రోజుల వ్యవధిలోనే పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో.. ఆయన ఆందోళనలో ఉన్నారు. జూన్ 28న మంచిర్యాల వచ్చిన రాజన్న.. ఆగస్టు 7నే అక్కడికి వెళ్లారు.

ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్‌కు తిరిగి రావడానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 18న రాజన్నను తిరిగి భారత్ పంపేందుకు ఆయన పనిచేసే సంస్థ సైతం టికెట్లు బుక్ చేసింది. కానీ ఈలోపే రాజధాని కాబుల్ సైతం తాలిబన్ల వశమైంది.

దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆయన అక్కడే చిక్కుకుపోయారు. రాజన్నతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన పెంచల వెంకన్న సైతం ఆప్ఘాన్‌లోనే చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా భారతదేశానికి తీసుకెళ్లాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఆప్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను మీడియా ద్వారా తెలుసుకుంటున్న ఇరువురి కుటుంబ సభ్యులు.. వారి క్షేమ సమాచారంపై ఆందోళన చెందుతున్నారు.

This post was last modified on August 19, 2021 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురంలో ఈ సారి వార్ వ‌న్‌సైడే…!

జ‌నసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్మోగుతోంది. ఎక్కడ…

5 minutes ago

పెద్దికి ఫ్రీ పబ్లిసిటీ

తెలుగులో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు.. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా.. పెద్ది. సంక్రాంతి తర్వాత వెలవెలబోతున్న టాలీవుడ్…

46 minutes ago

21 ఇండస్ట్రీ ప్రతినిధులు… తీరిపోవాలి సమస్యలు

ఇండస్ట్రీని గత నాలుగైదు రోజులుగా కుదిపేస్తున్న సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ వివాదం ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు వేయడం మూవీ…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… పెద్ద బరువుని మోయాలి

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్…

1 hour ago

పవన్ సర్జరీ వెనుక పెద్ద కారణమే ఉంది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ‌త నెల‌లో హ‌ఠాత్తుగా అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం, ఆయ‌న‌కు అత్య‌వ‌స‌రంగా శ‌స్త్ర చికిత్స…

2 hours ago

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…

6 hours ago