Political News

మూడో సారి వ్యాక్సిన్ కుదరదు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ముందుగా.. కోవాగ్జిన్, కోవీషీల్డ్… ఈ రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ నే తీసుకున్నారు. చాలా మందివి రెండు డోసులు తీసుకోవడం కూడా పూర్తైంది. కాగా.. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్న వ్యక్తి.. మళ్లీ మరో వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంటే.. కోవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్న వ్యక్తి మళ్లీ కోవిషీల్డ్ తీసుకోవచ్చా..? ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఒకసారి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యాక మరోసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని తెలిపింది. ఇప్పటికే రెండు డోసులు కోవాగ్జిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. తనకు కోవిషీల్డ్ వేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.

తాను సౌదీ అరేబియాలో పని చేస్తున్నానని, కోవాగ్జిన్‌ వేసుకున్నవారిని అక్కడ అనుమతించడం లేదని, కాబట్టి తనకు మళ్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయాలని కోరాడు. ఈ పిటిషన్‌కు కేంద్రం సమాధానం చెప్పింది. ఒకసారి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తికి రీ-వ్యాక్సినేషన్ ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికి ఒక వ్యక్తికి కేవలం రెండు డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే అందిస్తున్నాం. అంతకంటే ఎక్కువ ఇస్తే అనారోగ్య సమస్యలు తలత్తే అవకాశాలున్నాయి. అలా ఇవ్వాలని ఇంటర్నేషనల్ గైడ్ లెన్స్‌ కూడా సూచించడం లేదు. కాబట్టి సదరు పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేం. అతని అభ్యర్థనకు అనుమతిస్తే... రీ-వ్యాక్సినేషన్ కోసం మరికొంత మంది కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.

This post was last modified on August 18, 2021 3:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

నీల్ తప్ప ఎవరూ చెప్పలేని గుట్టు

గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…

2 hours ago

మరో బాహుబలి.. ట్రెండ్ సెట్ చేస్తుందా

కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…

2 hours ago

గుడ్డు-మ‌ట్టి.. మోడీపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్!

మాట‌ల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. త‌మ వ్యం గ్యాస్త్రాలు,…

3 hours ago

సమ్మర్ హీట్.. వందేళ్ల రికార్డ్ బ్రేక్

ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు  జారీచేస్తున్నది.  ఆంధ్రప్రదేశ్‌,…

4 hours ago

కూట‌మి మేనిఫెస్టో.. సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే!

తాజాగా ఏపీలో కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీలు మేనిఫెస్టో విడుద‌ల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్ర‌బాబు చెబుతున్న…

13 hours ago

ఉమ్మడి మేనిఫెస్టో.. బీజేపీ దూరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…

14 hours ago