Political News

మూడో సారి వ్యాక్సిన్ కుదరదు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ముందుగా.. కోవాగ్జిన్, కోవీషీల్డ్… ఈ రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ నే తీసుకున్నారు. చాలా మందివి రెండు డోసులు తీసుకోవడం కూడా పూర్తైంది. కాగా.. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్న వ్యక్తి.. మళ్లీ మరో వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంటే.. కోవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్న వ్యక్తి మళ్లీ కోవిషీల్డ్ తీసుకోవచ్చా..? ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఒకసారి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యాక మరోసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని తెలిపింది. ఇప్పటికే రెండు డోసులు కోవాగ్జిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. తనకు కోవిషీల్డ్ వేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.

తాను సౌదీ అరేబియాలో పని చేస్తున్నానని, కోవాగ్జిన్‌ వేసుకున్నవారిని అక్కడ అనుమతించడం లేదని, కాబట్టి తనకు మళ్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయాలని కోరాడు. ఈ పిటిషన్‌కు కేంద్రం సమాధానం చెప్పింది. ఒకసారి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వ్యక్తికి రీ-వ్యాక్సినేషన్ ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికి ఒక వ్యక్తికి కేవలం రెండు డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే అందిస్తున్నాం. అంతకంటే ఎక్కువ ఇస్తే అనారోగ్య సమస్యలు తలత్తే అవకాశాలున్నాయి. అలా ఇవ్వాలని ఇంటర్నేషనల్ గైడ్ లెన్స్‌ కూడా సూచించడం లేదు. కాబట్టి సదరు పిటిషనర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేం. అతని అభ్యర్థనకు అనుమతిస్తే... రీ-వ్యాక్సినేషన్ కోసం మరికొంత మంది కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.

This post was last modified on August 18, 2021 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

45 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago