ఆప్ఘనిస్తాన్ ని పూర్తిగా తాలిబన్లు ఆక్రమించుకున్నారు. తాలిబన్లు ఎంటర్ కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అఫ్రాఫ్ గని పరారయ్యాడన్నసంగతి కూడా తెలిసిందే. దేశానికి ఆపద వస్తే.. అధ్యక్షుడు అలా పారిపోయాడనే వార్త ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అంతకుమించి ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. అష్రాఫ్ గని పోతూ పోతూ.. డబ్బల మూటలు కట్టుకొని మరీ వెళ్లిపోవడం గమనార్హం.
తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని, నాలగు కార్ల నిండా డబ్బు మూటలు కట్టుకుని, అందులో సరిపోకపోతే హెలికాప్టర్ లో ఎక్కించుకుని పారిపోయినట్లు సమాచారం బయటకి వచ్చింది. ఈ మేరకు కాబూల్ లోని రష్యన్ రాయబార కార్యాలయం పేర్కొంది.
నాలుగు కార్లు డబ్బుతో నిండి ఉన్నాయి. అదీగాక కొంత డబ్బుని హెలికాప్తర్ లో నింపాలని చూసారు. అందులో కొంత డబ్బు రోడ్డు మీద పడి ఉందని, రష్యా రాయబార కార్యాలయ ప్రతినిధి నికితా ఇష్చెంకో వెల్లడించిందని, RIA న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి బిస్మిల్లా మహ్మదీ చేసిన ఒకానొక ట్వీటులో, మా చేతులను బంధించి మా మాతృభూమిని అమ్మారని, దీనికంతటికీ కారణం ఆ ధనవంతుడే అని అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసారు.
ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ నాయకుడు అబ్దుల్లా మాట్లాడిన ఒకానొక వీడియో ప్రకారం, అష్రాఫ్ ఘని దేశం విడిచి వెళ్ళిపోయి ఉంటాడని వ్యాఖ్యానించారు. తాలిబన్ తిరుగుబాటు దారులు దేశాన్ని ఆక్రమించుకోవడానికి కారకులైన అధ్యక్షుడు ఘని, ఉపాధ్యక్షుడు.. ఇద్దరూ కలిసి దేశం విడిచి వెళ్ళిపోయి ఉంటారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక అధ్యక్షుడు ఘని నుండి ఒక్క సందేశం కూడా బయటకు రాలేదు. మరో పక్క ఉపాధ్యక్షుడు కూడా స్పందించలేదు. అదే అంతకుముందు ఒకసారి మాట్లాడిన ఉపాధ్యక్షుడు, దేశాన్ని ఎవరి చేతుల్లోకి వెళ్ళనివ్వము అని కామెంట్లు చేసాడు.
This post was last modified on August 17, 2021 3:13 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…
వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో…
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…