Political News

తాలిబన్ల దెబ్బ అంత గట్టిగా పడిందా ?

ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబన్ల అరాచకాలను విదేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రాజధాని కాబూల్ నుండి తమ రాయబార కార్యాలయాల్లోని ఉన్నతాధికారులను, ఉద్యోగులందరినీ తిరిగి వచ్చేయాలంటు ఆయా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. అన్నీ దేశాలకన్నా ముందుగా అమెరికా, ఇండియాలు తమ సిబ్బందిని వెనక్కు పిలిపించేస్తున్నాయి. అమెరికా అయితే తమ మిలిట్రీని దగ్గరుండి మరీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారందరినీ విమానాలెక్కించేస్తోంది.

విమానాల్లో ప్రయాణించటానికి కుదరని ఉద్యోగుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్లలో సమీప ప్రాంతాలకు తరలించి అక్కడినుండి విమానాల్లో వచ్చే ఏర్పాట్లు చేసింది. ఇదే పద్దతిలో భారత ప్రభుత్వం కూడా సిబ్బందిమొత్తాన్ని దేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. ఆఫ్ఘన్లో ఉండటం ఇపుడు ఎంతమాత్రం క్షేమంకాదని స్పష్టంగా చెప్పింది. కాబూల్ లోని సుమారు 70 విదేశాల రాయబార కార్యాలయాలు కూడా తమ ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నాయి.

ఇదే సమయంలో దేశ సరిహద్దులన్నింటినీ తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. కాబూల్ లోకి తాలిబన్ సైన్యం ప్రవేశించింది. రాజధానిలోని కీలకమైన ప్రాంతాలను తమ గుప్పిట్లోకి ఉగ్రాదులు తెచ్చేసుకున్నారు. దేశంలో ఉన్న 32 రాష్ట్రాల్లో ఇప్పటికే 20 రాష్ట్రాలు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కాబూల్ లో కాల్పులు జరపవద్దని, ప్రజలకు ఎలాంటి నష్టమూ చేయవద్దని ప్రభుత్వం పదే పదే వేడుకుంటోంది. ప్రభుత్వవైఖరి చూస్తుంటే ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. ఫలితంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు.

ఇప్పటికే ఆర్ధికమంత్రితో పాటు చాలామంది మంత్రులు, గవర్నర్లు దేశంనుండి పరారయ్యారట. అంటే మంత్రులు తాలిబన్లకు దొరక్కుండా తమ దారి తాము చూసుకుంటున్నారు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా గల్ఫ్ దేశాలకు కానీ లేదా అమెరికాకు కూడా పారిపోవచ్చనే ప్రచారం పెరిగిపోతోంది. ఆఫ్ఘన్లో తాలిబన్లు ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా పేరుగొప్ప ఐక్యరాజ్యసమితి ప్రకటనలు ఇవ్వటం, ఆందోళన వ్యక్తంచేయటం మినహా ఇంకేమీ చేయలేకపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on August 16, 2021 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago