ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా భయంకరంగా తయారవుతున్నాయి. రోజు రోజుకు తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతుండటంతో ఏమి చేయాలో అర్థం కాక చివరకు దేశం వదిలి పారిపోతున్నారు. ప్రతిరోజు వందల మంది దేశం సరిహద్దులను దాటి పోతున్నారు. వీరిలో కొందరు భారత్ లోకి అడుగుపెడుతున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దులు దాటిన వారిలో కొందరు పాకిస్థాన్ లోకి వెళిపోతుంటే మరికొందరు నాన అవస్థలు పడి భారత్ లోకి వచ్చేస్తున్నారు.
మామూలు జనాల విషయాన్ని పక్కన పెట్టేస్తే చివరకు దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే కుటుంబంతో సహా దేశాన్ని విడిచి గల్ఫ్ దేశాలకు కానీ లేదా అమెరికాకు కానీ పారిపోయి తలదాచుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దేశాధ్యక్షుడే దేశాన్ని వదిలి పారిపోయే ఆలోచనలో ఉన్నారంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమైపోతోంది.
రాజధాని కాబూల్ కు 11 కిలోమీటర్ల దూరంలో చుట్టుపక్కల ఉన్న నగరాలను, పట్టణాలను ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించారు. శుక్రవారం కాందహార్ ను తమ ఆధీనంలోకి తాలిబన్లు తీసేసుకున్నారు. దాంతో కాబూల్ ను ఆక్రమించడానికి ఎక్కువ రోజులు పట్టదని అధ్యక్షుడు ఘనీకి బాగా అర్థమైపోయింది. తాలిబన్లతో పోరాడేంత సీన్ సివిల్ పోలీసులకు కానీ మిలిటరీకి కూడా లేదు. ఈ విషయం తాలిబన్లకు బాగా తెలియడం వల్లే అత్యంత అధునాతన ఆయుధాలతో తీవ్రవాదులు విరుచుకుపడుతున్నారు.
కాల్పుల విరమణ పాటించాలని, జనాల ఊచకోతను మానుకోవాలని ఐక్య రాజ్య సమితి ఎంత మొత్తుకుంటున్నా తాలిబన్లు పట్టించుకోవటంలేదు. దేశంలో ఉన్న 400 జిల్లాల్లో ఇప్పటికే సుమారు 70 శాతం జిల్లాలు తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్ళిపోయాయి. తమ ఆధీనంలో ఉన్న భూభాగంలో తాము రూపొందిచింన షరియా చట్టాలను మాత్రమే అమల్లో ఉంటాయని తాలిబన్లు స్పష్టంగా ప్రకటించేశారు. రోడ్లమీద కనిపించిన జనాలను అకారణంగా తాలిబన్లు కాల్చి చంపేస్తున్నారు.
ఇళ్లల్లోకి జొరబడి ఆడవాళ్ళను, అమ్మాయిలను ఎత్తుకు పోతున్నారు. వాళ్ళ ఇష్టంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఎదురుతిరిగిన వాళ్ళని చంపేస్తున్నారు. ఇలాంటి అరాచకాలను తట్టుకోలేక చివరికి జనాలు దేశం వదిలి పారిపోతున్నారు. ఆఫ్ఘనిస్థాన్లోని పరిస్థితులే దాదాపు పాకిస్ధాన్ లో కూడా ఉండటంతో అక్కడ ఉండటం ఇష్టం లేక జనాలు భారత్ లోకి వచ్చేస్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు ? ఎలా సర్దుకుంటుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.
This post was last modified on August 15, 2021 10:57 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…