ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకమే చివరకు కేసీయార్ కొంప ముంచేట్లుంది. ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ లో జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే తాను దత్తత తీసుకున్న నల్గొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పథకాన్ని సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. 16వ తేదీ బహిరంగ సభలో లబ్దిదారులను ప్రకటించబోతున్నారు.
ఇందులో భాగంగానే అధికారులు శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం మొదలుపెట్టారు. దీంతో చాలా గ్రామాల్లో దళితులకు, అధికారులకు మధ్య పెద్ద గొడవలే జరిగాయి. దళితబంధు పథకంలో లబ్దిదారులుగా టీఆర్ఎస్ కార్యకర్తలను, భూమి ఉన్నవారిని, ఉద్యోగుల కుటుంబాలనే ఎంపిక చేస్తున్నారంటు వీణవంక, కందుగుల, కోరపల్లి తదితర గ్రామాల్లో పెద్దఎత్తున దళితులు ఆందోళనలు చేశారు.
కేసీయార్ పథకాన్ని పెట్టింది దళితుల కోసమా లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తల కోసమా అంటూ ఎంఆర్వోలను దళితులు, దళిత సంఘాలు నిలదీశాయి. దాంతో అధికారులు, టీఆర్ఎస్ నేతలతో దళితులకు చాలా గ్రామాల్లో గొడవలు జరిగాయి. నిజానికి దళితబంధు పథకంలో లబ్దిదారులుగా భూమిలేని వారిని, నిరుపేదలను, కూలీలకు, నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మధ్యలో మంత్రులు, పార్టీ ఎంఎల్ఏ లు, నేతలు జోక్యం చేసుకోవడంతో లబ్ధిదారుల ఎంపికంతా రాజకీయమైపోయింది.
నియోజకవర్గంలో 5 వేల మంది లబ్దిదారులకు తలా రు. 10 లక్షలు పంపిణీ చేయాలన్నది కేసీఆర్ టార్గెట్. ఒకేసారి వేలాదిమంది లబ్దిదారులకు పెద్ద మొత్తంలో డబ్బులు అందుతుండటంతో లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతల జోక్యం బాగా పెరిగిపోతోంది. వీరిని కాదనలేక అధికారులు కూడా వాళ్ళు చెప్పిన వారికి జాబితాలో చోటు కల్పిస్తున్నారు. దాంతో దళితులు అధికార, పార్టీ నేతలపై తిరగబడుతున్నారు. చివరకు ఇదంతా కలిసి 16వ తేదీ సభలోనో లేకపోతే ఉప ఎన్నికలోనో కేసీయార్ కొంప ముంచుతుందనే ప్రచారం పెరిగిపోతోంది.
This post was last modified on August 14, 2021 1:05 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…