Political News

జగన్ నిర్ణయం బూమరాంగ్ అవుతుందా ?

కరోనా వైరస్..ఒకరికి ఉంటే వందమందికి చాలా తేలిగ్గా సోకేస్తుంది. ఈ లక్షణం వల్లే ప్రపంచంలో కొన్ని కోట్లమంది వైరస్ భారినపడ్డారు. మనదేశంలో కూడా కొన్ని వేలమరణాలకు కరోనా వైరస్సే కారణమవ్వటం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ప్రాణంతాక వైరస్ ను ఇంటిముందే పెట్టుకుని ఈనెల 16వ తేదీనుండి స్కూళ్ళు తెరవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఎంతమాత్రం శ్రయేస్కరంకాదు.

గతంలో కూడా కొన్ని సార్లు స్కూళ్ళు తెరవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే విద్యార్ధులకో లేదా టీచర్లకో కరోనా వైరస్ సోకటం వల్ల స్కూల్లోని చాలామందికి సోకింది. దాంతో అప్పటికప్పుడు స్కూళ్ళని మూసేసిన ఘటనలున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే రేపు 16వ తేదీనుండి స్కూళ్ళు తెరవాలని ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. అయితే గతంలోనే ఇదే విషయమై జగన్ మాట్లాడుతూ స్కూళ్ళు తెరిచేటప్పటికే అందరు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని చెప్పారు.

అయితే వాస్తవం ఏమిటి ? ఏమిటంటే ఇంకా 70 వేలమంది టీచర్లకు వ్యాక్సినేషన్ కాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ళల్లో సుమారు 2.83 లక్షలమంది టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్ళల్లో 1.34 లక్షల మంది మాత్రమే మొదటి డోసు వేయించుకున్నారు. రెండో డోసు వేయించుకున్న టీచర్లు సుమారు 80 వేలమందున్నారు. అంటే గతంలో జగన్ చెప్పినట్లు నూరుశాతం వ్యాక్సినేషన్ కాలేదన్నది వాస్తవం. మరి టీచర్లకు నూరుశాతం వ్యాక్సినేషన్ కాకుండానే స్కూళ్ళు ఎలా తెరుస్తారు ?

ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండు డోసుల టీకాలు వేసుకున్నవారికి కూడా కరోనా వైరస్ సోకుతోందన్న విషయమే ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నేపధ్యంలో ప్రభుత్వం ఎంతజాగ్రత్తగా ఉండాలి ? టీచర్ల సంగతిని పక్కనపెట్టేస్తే విద్యార్ధుల్లో ఎవరైనా వైరస్ సోకిన వాళ్ళుంటే వెంటనే అందరికీ సోకటానికి ఎక్కువ రోజులుపట్టదు. అప్పుడెవరికైనా జరగరానికి జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ? మరి స్కూళ్ళు ఎప్పుడు తెరవాలి ? అంటే సమస్య ఉన్నంత కాలం స్కూళ్ళు తెరవటం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.

స్కూళ్ళ రీఓపెనింగ్-కరోనా వైరస్ తీవ్రత విషయంలో ప్రిస్టేజీకి పోతే నష్టపోయేది విద్యార్ధులే అన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి. వైరస్ విద్యార్ధికి సోకితే అది విద్యార్ధికి మాత్రమే పరిమితం కాదు. వాళ్ళ ఇంట్లోని అందరికీ సోకుతుంది. అప్పుడు కుటుంబాలకు కుటుంబాలే వైరస్ భారిన పడటం ఖాయం. దాంతో కరోనా వైరస్ మళ్ళీ ప్రమాధకరంగా వ్యాపించేస్తుంది. కాబట్టి ఈ సమస్య సమూలంగా పోయిందనేంతవరకు ఆన్ లైన్లో క్లాసులు నడపటమే మంచిది.

This post was last modified on August 13, 2021 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago