Political News

టీడీపీని ఓడించింది బీజేపీనేట !

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము చేస్తున్న ప్రకటనలను జనాలు నమ్ముతారా ? లేదా నవ్వుకుంటారా ? అనే వెరుపు కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. మీడియాతో వీర్రాజు మాట్లాడుతు వైసీపీకి గట్టి వార్నింగే ఇచ్చారు. తమతో పెట్టుకుంటే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందని చాలా ఘాటుగా వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.

ఇంతకీ బీజేపీతో పెట్టుకున్నందు వల్ల టీడీపీకి ఎలాంటి గతిపట్టింది ? అంటే ఘోరంగా ఓడిపోయిందట. తమతో పెట్టుకున్నందువల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటుకు సీట్టకు పడిపోయిందని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇక్కడే వీర్రాజు చేసిన ప్రకటన విషయంలో జనాలు ముందు హాస్చర్యపోయి తర్వాత నవ్వుకుంటున్నారు. జనాలందరు జగన్మోహన్ రెడ్డి దెబ్బకే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కుదేలైపోయిందని అనుకుంటున్నారు.

ఇందుకు కారణం ఏమిటంటే టీడీపీ ఓడిపోయిన అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాల్లో వైసీపీనే గెలిచింది కాబట్టి. మరి మధ్యలో బీజేపీ దెబ్బకు టీడీపీ కుదేలవ్వటం ఏమిటి ? నిజంగానే వీర్రాజు చెప్పింది నిజమైతే మరి బీజేపీ ఒక్క అసెంబ్లీ, ఎంపి సీటులో కూడా ఎందుకని గెలవలేదు ? టీడీపీని దెబ్బకొట్టేంత సీనే బీజేపీకి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే తాను పోటీచేసిన ఏ సీటులో కూడా కమలంపార్టీ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు.

వాస్తవాలు ఇలాగుంటే అందరికీ తెలిసిన లాజిక్ కూడా మరచిపోయి వీర్రాజు ప్రకటనలు చేసేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అప్పటి సాధారణ ఎన్నికలే కాదు ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. అసలు పోటీ చేయటానికి అభ్యర్ధులే దొరకటం లేదు కమలంపార్టీకి. వాస్తవం ఇలాగుంటే వీర్రాజు మాత్రం మీడియాను చూడగానే పూనకం వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు.

This post was last modified on August 13, 2021 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago