Political News

ఏపీలో చెలిమి పేరిట క‌మ‌లం చెల‌గాటం ?

ఏపీలో రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. ఒక వైపు వైసీపీ అధికారంలో ఉంది. మరో వైపు టీడీపీ విపక్షంలో ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలకే ఏపీలో బేస్ ఉంది. జనాల్లో ఆదరణ ఉంది. అయితే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం ఈ పార్టీలను ఒక ఆట ఆడించేస్తోంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు తనతోనే ఉండాలని, తన మాటే వినాలని కావాలనే వెంట తిప్పుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ రెండు పార్టీలకు ఉన్న ఇబ్బందులు, గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నా బీజేపీని వీడలేని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. దాంతో మిగిలిన పార్టీలకు ఈ రెండు పార్టీల పొలిటికల్ స్టాండ్ ఏంటో అసలు అర్ధం కావడంలేదు.

కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని అతి పెద్ద ప్రయత్నం జరుగుతోంటే ఏపీ నుంచి మాత్రం ఈ రెండు పార్టీల ఉలుకూ పలుకూ అసలు లేవు. ఏపీలో బీజేపీతో చేతులు కలిపి ముందుకు సాగాలని టీడీపీ చూస్తోంది. అదే టైమ్ లో బీజేపీ టీడీపీ అసలు కలవకూడదు అన్న ఒకే ఒక అజెండాతో వైసీపీ పనిచేస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా తనకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ అనుమానిస్తోంది. అందుకోసం ఇష్టం లేకపోయినా అనివార్యంగా బీజేపీతో స్నేహం చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ ఆ విధంగా మద్దతు ఇస్తోంది.

దీని వల్ల వైసీపీకి వ్యక్తిగతంగా కానీ ఏపీకి అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కూడా పంటి బిగువున బీజేపీతో చెలిమి చేస్తున్నట్లుగా వైసీపీ రాజకీయ నాటకమే ఆడుతోంది అంటున్నారు. ఇక టీడీపీది అదే సీన్. వైసీపీ, బీజేపీ కలసికట్టుగా ఉంటే ఏపీలో తన రాజకీయం పండదు అనేదే టీడీపీ లెక్క. అందుకే ఎలాగైనా వైసీపీ నుంచి బీజేపీని విడగొట్టాలన్నది టీడీపీ పంతం పట్టుదల. అవసరం అయితే తాను బీజేపీ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా రెడీ అంటూ పసుపు పార్టీ సంకేతాలు పనంపుతోంది. బీజేపీ విషయం తీసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను అలా తన చెప్పుచేతలలో ఉంచుకోవాలన్నదే వ్యూహం.

వైసీపీని చేరదీస్తున్నట్లుగా కనిపిస్తూనే టీడీపీకి కూడా దూరం కాకూడదు అన్న ఎత్తుగడ. వీటికి మించి బీజేపీకి ఉన్న మరో ప్లాన్ ఏంటి అంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు యాంటీ మోడీ క్యాంప్ లో చేరకూడదు. అందుకోసం వాటితో చెలిమి పేరిట కమలం చెలగాటమే ఆడుతోంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో స్నేహాలు ఏవీ ఉండవు. అన్నీ అవసరాలే. అందువల్ల అలాంటి అవసరాలతో ఏపీలో మూడు పార్టీల మధ్య అతి పెద్ద రాజకీయ దోబూచాట సాగుతోంది. ఇందులో విజేతలు ఎవరు అన్నది 2024 ఎన్నికల ఫలితాలు వస్తేనే తప్ప తెలియదు.

This post was last modified on August 12, 2021 2:10 pm

Share
Show comments

Recent Posts

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

2 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

2 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

2 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

3 hours ago

‘చెడు’ చూపించకుంటే ‘మంచి’ బయోపిక్ ఎలా?

70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…

4 hours ago

ప్రేమ కావాలంటే డార్లింగ్ జోరు తగ్గాలి

కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…

4 hours ago