Political News

ఏపీలో చెలిమి పేరిట క‌మ‌లం చెల‌గాటం ?

ఏపీలో రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. ఒక వైపు వైసీపీ అధికారంలో ఉంది. మరో వైపు టీడీపీ విపక్షంలో ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలకే ఏపీలో బేస్ ఉంది. జనాల్లో ఆదరణ ఉంది. అయితే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం ఈ పార్టీలను ఒక ఆట ఆడించేస్తోంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు తనతోనే ఉండాలని, తన మాటే వినాలని కావాలనే వెంట తిప్పుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ రెండు పార్టీలకు ఉన్న ఇబ్బందులు, గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నా బీజేపీని వీడలేని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. దాంతో మిగిలిన పార్టీలకు ఈ రెండు పార్టీల పొలిటికల్ స్టాండ్ ఏంటో అసలు అర్ధం కావడంలేదు.

కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని అతి పెద్ద ప్రయత్నం జరుగుతోంటే ఏపీ నుంచి మాత్రం ఈ రెండు పార్టీల ఉలుకూ పలుకూ అసలు లేవు. ఏపీలో బీజేపీతో చేతులు కలిపి ముందుకు సాగాలని టీడీపీ చూస్తోంది. అదే టైమ్ లో బీజేపీ టీడీపీ అసలు కలవకూడదు అన్న ఒకే ఒక అజెండాతో వైసీపీ పనిచేస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా తనకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ అనుమానిస్తోంది. అందుకోసం ఇష్టం లేకపోయినా అనివార్యంగా బీజేపీతో స్నేహం చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ ఆ విధంగా మద్దతు ఇస్తోంది.

దీని వల్ల వైసీపీకి వ్యక్తిగతంగా కానీ ఏపీకి అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కూడా పంటి బిగువున బీజేపీతో చెలిమి చేస్తున్నట్లుగా వైసీపీ రాజకీయ నాటకమే ఆడుతోంది అంటున్నారు. ఇక టీడీపీది అదే సీన్. వైసీపీ, బీజేపీ కలసికట్టుగా ఉంటే ఏపీలో తన రాజకీయం పండదు అనేదే టీడీపీ లెక్క. అందుకే ఎలాగైనా వైసీపీ నుంచి బీజేపీని విడగొట్టాలన్నది టీడీపీ పంతం పట్టుదల. అవసరం అయితే తాను బీజేపీ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా రెడీ అంటూ పసుపు పార్టీ సంకేతాలు పనంపుతోంది. బీజేపీ విషయం తీసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను అలా తన చెప్పుచేతలలో ఉంచుకోవాలన్నదే వ్యూహం.

వైసీపీని చేరదీస్తున్నట్లుగా కనిపిస్తూనే టీడీపీకి కూడా దూరం కాకూడదు అన్న ఎత్తుగడ. వీటికి మించి బీజేపీకి ఉన్న మరో ప్లాన్ ఏంటి అంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు యాంటీ మోడీ క్యాంప్ లో చేరకూడదు. అందుకోసం వాటితో చెలిమి పేరిట కమలం చెలగాటమే ఆడుతోంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో స్నేహాలు ఏవీ ఉండవు. అన్నీ అవసరాలే. అందువల్ల అలాంటి అవసరాలతో ఏపీలో మూడు పార్టీల మధ్య అతి పెద్ద రాజకీయ దోబూచాట సాగుతోంది. ఇందులో విజేతలు ఎవరు అన్నది 2024 ఎన్నికల ఫలితాలు వస్తేనే తప్ప తెలియదు.

This post was last modified on August 12, 2021 2:10 pm

Share
Show comments

Recent Posts

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

2 mins ago

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

1 hour ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

12 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

13 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago