Political News

ఏపీలో చెలిమి పేరిట క‌మ‌లం చెల‌గాటం ?

ఏపీలో రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. ఒక వైపు వైసీపీ అధికారంలో ఉంది. మరో వైపు టీడీపీ విపక్షంలో ఉంది. నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలకే ఏపీలో బేస్ ఉంది. జనాల్లో ఆదరణ ఉంది. అయితే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం ఈ పార్టీలను ఒక ఆట ఆడించేస్తోంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు తనతోనే ఉండాలని, తన మాటే వినాలని కావాలనే వెంట తిప్పుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇక ఈ రెండు పార్టీలకు ఉన్న ఇబ్బందులు, గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నా బీజేపీని వీడలేని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. దాంతో మిగిలిన పార్టీలకు ఈ రెండు పార్టీల పొలిటికల్ స్టాండ్ ఏంటో అసలు అర్ధం కావడంలేదు.

కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని అతి పెద్ద ప్రయత్నం జరుగుతోంటే ఏపీ నుంచి మాత్రం ఈ రెండు పార్టీల ఉలుకూ పలుకూ అసలు లేవు. ఏపీలో బీజేపీతో చేతులు కలిపి ముందుకు సాగాలని టీడీపీ చూస్తోంది. అదే టైమ్ లో బీజేపీ టీడీపీ అసలు కలవకూడదు అన్న ఒకే ఒక అజెండాతో వైసీపీ పనిచేస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా తనకు కొత్త ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ అనుమానిస్తోంది. అందుకోసం ఇష్టం లేకపోయినా అనివార్యంగా బీజేపీతో స్నేహం చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ ఆ విధంగా మద్దతు ఇస్తోంది.

దీని వల్ల వైసీపీకి వ్యక్తిగతంగా కానీ ఏపీకి అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కూడా పంటి బిగువున బీజేపీతో చెలిమి చేస్తున్నట్లుగా వైసీపీ రాజకీయ నాటకమే ఆడుతోంది అంటున్నారు. ఇక టీడీపీది అదే సీన్. వైసీపీ, బీజేపీ కలసికట్టుగా ఉంటే ఏపీలో తన రాజకీయం పండదు అనేదే టీడీపీ లెక్క. అందుకే ఎలాగైనా వైసీపీ నుంచి బీజేపీని విడగొట్టాలన్నది టీడీపీ పంతం పట్టుదల. అవసరం అయితే తాను బీజేపీ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా రెడీ అంటూ పసుపు పార్టీ సంకేతాలు పనంపుతోంది. బీజేపీ విషయం తీసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను అలా తన చెప్పుచేతలలో ఉంచుకోవాలన్నదే వ్యూహం.

వైసీపీని చేరదీస్తున్నట్లుగా కనిపిస్తూనే టీడీపీకి కూడా దూరం కాకూడదు అన్న ఎత్తుగడ. వీటికి మించి బీజేపీకి ఉన్న మరో ప్లాన్ ఏంటి అంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు యాంటీ మోడీ క్యాంప్ లో చేరకూడదు. అందుకోసం వాటితో చెలిమి పేరిట కమలం చెలగాటమే ఆడుతోంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో స్నేహాలు ఏవీ ఉండవు. అన్నీ అవసరాలే. అందువల్ల అలాంటి అవసరాలతో ఏపీలో మూడు పార్టీల మధ్య అతి పెద్ద రాజకీయ దోబూచాట సాగుతోంది. ఇందులో విజేతలు ఎవరు అన్నది 2024 ఎన్నికల ఫలితాలు వస్తేనే తప్ప తెలియదు.

Satya

Recent Posts

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

1 hour ago

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని…

1 hour ago

కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు

వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్…

3 hours ago

కోటీశ్వరుడితో పెళ్ళి, కానీ ప్రేమికుడి కోసం….

పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు భార్య‌ల‌ను చంపే భ‌ర్త‌ల వ్య‌వ‌హారాలు పెద్ద…

8 hours ago

తెప్ప త‌గ‌లేసిన త‌మ‌న్నా

కెరీర్ తొలి నాళ్ల‌లో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌పుడు ద‌క్షిణాదిన వ‌చ్చే ప్ర‌తి ఛాన్సునూ మ‌హా ప్ర‌సాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…

8 hours ago

పెద్ది ఈవెంట్ లో పవన్ హవా

మెగా హీరోల సినిమాల‌కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్క‌డో ఒక చోట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

10 hours ago