ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, అథ్లెట్లు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. ఇక, కాంస్య పతకం కోసం బ్రిటన్ తో జరిగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. అయితే, భారత మహిళల హకీ జట్టు పోరాట పటిమకు బ్రిటన్ జట్టుతో పాటు యావత్ భారత దేశం ఫిదా అయింది. మ్యాచ్ ఓడినా…కోట్లాది భారతీయుల హృదయాలు గెలుచుకున్నారంటూ ప్రధాని మోడీ సైతం భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఫోన్ చేసి అభినందించారు.
ఈ క్రమంలోనే భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు, ఉద్యోగాలు ప్రకటించి సముచితంగా గౌరవించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మహిళల హాకీ జాతీయ జట్టు సభ్యురాలు ఈ.రజనిపై ఏపీ సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. రజనికి జగన్ రూ. 25లక్షల నగదు నజరానా ప్రకటించడంతో పాటు రజని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టోక్యో నుంచి తిరిగి వచ్చిన రజని….నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను తన తల్లిదండ్రులతో పాటు కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రజనీని సీఎం జగన్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. తిరుపతిలో రజనికి 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్లు కూడా ఇవ్వాలని అధికారులను జగన్ ఆదేశించారు. దీంతోపాటు, గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్లో ఉంచిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలేనికి చెందిన రజని 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ లోనూ భారత జట్టుకు ఎంపికయ్యారు. కామన్ వెల్త్ గేమ్స్ లోనూ సత్తా చాటిన రజని ఇప్పటిదాకా 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్లలో రాణించారు.
This post was last modified on August 12, 2021 10:11 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…