వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహిత నేత ఒకరు వైసీపీని వీడి.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా.. కడప జిల్లాలో జగన్ గా అండగా నిలుస్తూ వస్తున్న కీలక నేత మండిపల్లి రాం ప్రసాద్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైసీపీ వీడ్కోలు పలికారు.
త్వరలో టీడీపీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా అయ్యారు. కడప జిల్లాతో పాటు రాయచోటిలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు, రాంప్రసాద్రెడ్డి చర్చించుకున్నట్లు సమాచారం.
పాదయాత్ర సమయంలో రాం ప్రసాద్రెడ్డి కీలకంగా వ్యవహరించగా, ఆయన పార్టీని వీడటం వల్ల స్థానికంగా వైసీపీ స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం ప్లాన్ చేయాలని రాంప్రసాద్రెడ్డికి చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎమ్మెల్యే గడికోట్ శ్రీకాంత్రెడ్డితో ఉన్న గొడవల వల్లే రాంప్రసాద్రెడ్డి వైసీపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీలోనూ అంతర్గత ముసలం మొదలైంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో షురూ అయింది. ఇప్పటి వరకు వైసీపీ బానే ఉందన్న అంచనాలు ఇక తలకిందులవుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎప్పటి నుంచో బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.
This post was last modified on August 11, 2021 3:53 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…