వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహిత నేత ఒకరు వైసీపీని వీడి.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా.. కడప జిల్లాలో జగన్ గా అండగా నిలుస్తూ వస్తున్న కీలక నేత మండిపల్లి రాం ప్రసాద్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైసీపీ వీడ్కోలు పలికారు.
త్వరలో టీడీపీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా అయ్యారు. కడప జిల్లాతో పాటు రాయచోటిలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు, రాంప్రసాద్రెడ్డి చర్చించుకున్నట్లు సమాచారం.
పాదయాత్ర సమయంలో రాం ప్రసాద్రెడ్డి కీలకంగా వ్యవహరించగా, ఆయన పార్టీని వీడటం వల్ల స్థానికంగా వైసీపీ స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం ప్లాన్ చేయాలని రాంప్రసాద్రెడ్డికి చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎమ్మెల్యే గడికోట్ శ్రీకాంత్రెడ్డితో ఉన్న గొడవల వల్లే రాంప్రసాద్రెడ్డి వైసీపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీలోనూ అంతర్గత ముసలం మొదలైంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో షురూ అయింది. ఇప్పటి వరకు వైసీపీ బానే ఉందన్న అంచనాలు ఇక తలకిందులవుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎప్పటి నుంచో బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.
This post was last modified on August 11, 2021 3:53 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…