వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహిత నేత ఒకరు వైసీపీని వీడి.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా.. కడప జిల్లాలో జగన్ గా అండగా నిలుస్తూ వస్తున్న కీలక నేత మండిపల్లి రాం ప్రసాద్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైసీపీ వీడ్కోలు పలికారు.
త్వరలో టీడీపీలో చేరనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా అయ్యారు. కడప జిల్లాతో పాటు రాయచోటిలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు, రాంప్రసాద్రెడ్డి చర్చించుకున్నట్లు సమాచారం.
పాదయాత్ర సమయంలో రాం ప్రసాద్రెడ్డి కీలకంగా వ్యవహరించగా, ఆయన పార్టీని వీడటం వల్ల స్థానికంగా వైసీపీ స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం ప్లాన్ చేయాలని రాంప్రసాద్రెడ్డికి చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎమ్మెల్యే గడికోట్ శ్రీకాంత్రెడ్డితో ఉన్న గొడవల వల్లే రాంప్రసాద్రెడ్డి వైసీపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీలోనూ అంతర్గత ముసలం మొదలైంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో షురూ అయింది. ఇప్పటి వరకు వైసీపీ బానే ఉందన్న అంచనాలు ఇక తలకిందులవుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎప్పటి నుంచో బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.
This post was last modified on August 11, 2021 3:53 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…