Political News

హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్..

అంచనాలు నిజమయ్యాయి. ముందుగా అనుకున్నట్లే హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా ముందు నుంచి పేరు వినిపిస్తున్న గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం సాగుతోంది. కొద్ది సేపటి క్రితం (బుధవారం) టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఆయనే ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ ఇప్పటివరకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు.. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకసార్లు జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలకు ధీటుగా అభ్యర్థిని ప్రకటించాలంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండటంతో పాటు.. వెనుకబడి కులానికి చెందిన నేత అయితే సరిగ్గా సరిపోతారు. ఈ కాంబినేషన్లను వర్కువుట్ చేసిన కేసీఆర్.. గెల్లుకు అవకాశం ఇచ్చారు. గెల్లును అభ్యర్థిగా ఎంపిక చేసిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు.. విద్యార్థులు.. యువత నుంచి కూడా మద్దతు లభిస్తుందన్న అంచనాతో ఉన్నట్లు చెబుతున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లలో అత్యధికం దళితులే అన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే తెలంగాణ దళిత బంధు పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ కులాలకు చెందిన నేతను బరిలోకి దించితే..కాంబినేషన్ పక్కాగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన్ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయంలో కిందామీదా పడుతోంది. తాజాగా గులాబీ అభ్యర్థి ఎవరన్నదిఅధికారికంగా బయటకు వచ్చేయటంతో.. ఉప ఎన్నిక వేడి మరింత పెరగటంఖాయమని చెప్పాలి.

This post was last modified on August 11, 2021 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

3 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

4 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

7 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

8 hours ago