అంచనాలు నిజమయ్యాయి. ముందుగా అనుకున్నట్లే హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా ముందు నుంచి పేరు వినిపిస్తున్న గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆయనే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం సాగుతోంది. కొద్ది సేపటి క్రితం (బుధవారం) టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఆయనే ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ ఇప్పటివరకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు.. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకసార్లు జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటలకు ధీటుగా అభ్యర్థిని ప్రకటించాలంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండటంతో పాటు.. వెనుకబడి కులానికి చెందిన నేత అయితే సరిగ్గా సరిపోతారు. ఈ కాంబినేషన్లను వర్కువుట్ చేసిన కేసీఆర్.. గెల్లుకు అవకాశం ఇచ్చారు. గెల్లును అభ్యర్థిగా ఎంపిక చేసిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు.. విద్యార్థులు.. యువత నుంచి కూడా మద్దతు లభిస్తుందన్న అంచనాతో ఉన్నట్లు చెబుతున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లలో అత్యధికం దళితులే అన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే తెలంగాణ దళిత బంధు పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ కులాలకు చెందిన నేతను బరిలోకి దించితే..కాంబినేషన్ పక్కాగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన్ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇప్పటికే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయంలో కిందామీదా పడుతోంది. తాజాగా గులాబీ అభ్యర్థి ఎవరన్నదిఅధికారికంగా బయటకు వచ్చేయటంతో.. ఉప ఎన్నిక వేడి మరింత పెరగటంఖాయమని చెప్పాలి.
This post was last modified on August 11, 2021 1:53 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…