ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఇక తమ నేర చరిత్రను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వారంతా గతంలో వారు చేసిన నేరాల పుట్టను విప్పాలంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉప సంహరించకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు.
ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ,పెండింగ్ కేసులు,ఇచ్చిన తీర్పులు,రిజర్వు చేసిన తీర్పుల వివరాలు ఆయా రాష్ట్రాల హైకోర్టు రిజిస్టర్ జనరల్ లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సత్వర న్యాయ విచారణ కోసం ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ జరుపుతున్న స్పెషల్ కోర్టులు,సిబిఐ కోర్టుల జడ్జీలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది .అలాగే రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల లోపు వారి నేర చరిత్రను పబ్లిష్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on August 10, 2021 4:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…