తాజాగా బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ గా అధికారపార్టీ టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన ప్రవీణ్ పై టీఆర్ఎస్ ఎంఎల్ఏలు వరుసబెట్టి ఆరోపణలు, విమర్శల బాణాలను వదులుతున్నారు. దానికి ఉద్యోగంలో ఉండగా ప్రవీణ్ చేసిన ప్రకటనలను తమ ఆరోపణలు, విమర్శలకు మద్దతుగా ఎంఎల్ఏలు గ్యాదిరి కిషోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, భాస్కరరావు ఉపయోగించుకుంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే రాజకీయాల్లోకి ప్రవేశించటం, బీఎస్పీలో చేరటం ఖాయమవ్వగానే ప్రవీణ్ వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టారు. కేసీయార్ వ్యవహారశైలిపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడుతున్నారు. సరే ప్రతిపక్షమన్నాక ఇదంతా మామూలని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రవీణ్ చేస్తున్న ఆరోపణలు మాత్రం కాస్త విచిత్రంగా ఉన్నాయనే చెప్పాలి.
ఇందుకు కారణాలు ఏమిటంటే మొన్నటివరకు ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా రిక్వెస్టు చేసుకుని ఎస్సీ సంక్షేమ శాఖలోని గురుకులాలకు ప్రత్యేక అధికారిగా ఉండిపోయారు. ఐపీఎస్ అధికారిగా కన్నా ఎస్సీల స్కూళ్ళు, హాస్టళ్ళ సంక్షేమం కోసం తాను పనిచేయాలని అనుకుంటున్నట్లు పెట్టుకున్న రిక్వెస్టును కేసీయార్ అంగీకరించారు. అందుకనే సుదీర్ఘకాలం గురుకులాల సంక్షేమం, బలోపేతానికి పాటుపడ్డారు. అధికారిగా ఆయన చేసిన సేవలను ఎవరు తప్పుపట్టడంలేదు.
అయితే గురుకులాలకు ప్రత్యేక అధికారిగా ఉన్న కాలంలో తనకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతును, ప్రోత్సాహాన్ని ప్రవీణ్ చాలాసార్లు ప్రస్తావించారు. ప్రభుత్వం మద్దతు లేనిదే తాను గురుకులాల బలోపేతానికి కృషి చేయగలిగేవాడిని కాదని చెప్పుకున్నారు. అంటే ఉద్యోగంలో ఉన్నంత కాలం పదే పదే ప్రభుత్వం పనితీరుపై పాజిటివ్ గా మాట్లాడిన ఇదే ప్రవీణ్ బీఎస్పీలో చేరగానే వ్యతిరేకంగా మాట్లాడుతుండటాన్ని ఎంఎల్ఏలు ఎండగడుతున్నారు. తమ ఎదురుదాడికి మద్దుతుగా అప్పట్లో ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో ప్రవీణ్ కృతజ్ఞతలు చెప్పుకున్న పేపర్ కటింగులను చూపిస్తున్నారు. మొత్తానికి ప్రవీణ్ పై టీఆర్ఎస్ ఎంఎల్ఏలు గట్టిగానే ఎటాక్ చేస్తున్నారనే అనుకోవాలి.
This post was last modified on August 10, 2021 12:09 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…