Political News

బీజేపీనే అసలైన ప్రతిపక్షమా ?

ప్రకటనలు చేయటంలో కమలనాదులకు మించిన వారు లేరన్నట్లుగా తయారైంది. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవటానికి బీజేపీనే అసలైన ప్రతిపక్షంగా తయారైందని ఆపార్టీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలమెంత ? ప్రజా ప్రతినిధులెంతమంది ? అన్న విషయాలు పరిశీలిస్తే చాలు జీవీఎల్ ప్రకటనలోని డొల్లతనం బయటపడుతుంది. ప్రస్తుతం బీజేపీ తరపున ఏకైక ఎంఎల్సీగా మాధవ్ ఉన్నారంతే.

ఏరోజు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నేతలు క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేసింది లేదు. ఎక్కడ ధర్నా అని పిలుపిచ్చినా పట్టుమని పదిమంది కూడా కనబడరు. అయితే మీడియా సమావేశాల్లో మాత్రం రెగ్యులర్ గా కనబడుతుంటారు. టీవీ డిబేట్లలోను, మీడియా సమావేశాల్లో మాత్రమే నేతల తమ వాణిని వినిపిస్తుంటారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదన్నది వాస్తవం.

నియోజకవర్గాల్లో పోటీకే అభ్యర్ధులు దొరకనిపార్టీ అధికార వైసీపీకి అసలైన ప్రతిపక్షమని కమలనాదులు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందికాబట్టే రాష్ట్రంలో ఈ మాత్రమైనా నేతలు మీడియా సమావేశాల్లో కనబడుతున్నారు. లేకపోతే ఇక్కడ కూడా కనబడరని అందరికీ తెలిసిందే. గడచిన రెండేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కొన్ని వందలసార్లు ఆరోపణలు, విమర్శలు చేసుంటారు.

ఇదే సమయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపిచ్చారు. అయితే వాటిలో ఒక్కపిలుపు కూడా సక్సెస్ కాలేదు. కారణం ఏమిటంటే ఆందోళనలను సక్సెస్ చేయటానికి రాష్ట్రవ్యాప్తంగా తగిన యంత్రాంగం లేకపోవటమే. పోనీ మిత్రపక్షం జనసేనను కలుపుకుని వెళుతున్నారా అంటే అదీలేదు. పేరుకు మాత్రమే మిత్రపక్షాలైనా అంతర్గతంగా రెండుపార్టీల మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. రేపటి ఎన్నికల్లో కూడా పోయిన ఎన్నికల సీనే రిపీటవుతుందనటంలో సందేహమేలేదు. అలాంటి బీజేపీనే అసలైన ప్రతిపక్షమని చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.

This post was last modified on August 9, 2021 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago