Political News

పార్టీలన్నీ ఆ సామాజివకర్గం చుట్టునే తిరుగుతున్నాయా ?

మరో ఏడు నెలల్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పేట్లు లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే బలమైన బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీ మీద బాగా గుర్రుగా ఉండటమే. యూపీ జనాభాలో బ్రాహ్మణులు 12 శాతం ఉన్నారు. అదే ఓటర్లపరంగా చూస్తే బ్రాహ్మణుల శాతం 20. 20 శాతం ఓట్లంటే మామూలు విషయంకాదు. ఓ పార్టీని గద్దెమీద కూర్చోబెట్టాలన్నా, దింపేయాలన్నా 20 శాతం ఓట్లు సరిపోతాయి.

ఈ విషయం బాగా తెలియటం వల్లే ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్ నానా అవస్తలు పడుతున్నారు. యూపీలో అసలు సమస్య ఏమిటంటే యోగి పాలన వల్లే బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీకి దూరమైంది. గడచిన నాలుగేళ్ళల్లో సుమారు 500 మంది బ్రాహ్మణులు హత్యకు గురయ్యారని అఖిల భారత బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు రాజేంద్రనాద్ త్రిపాఠి ఆరోపించారు.

ఇంతేకాకుండా ఓ పద్దతి ప్రకారం బ్రాహ్మణులను యోగి ప్రభుత్వం అణిచివేస్తోందని సామాజికవర్గంలోని ప్రముఖులు పదే పదే ఆరోపిస్తున్నారు. బ్రాహ్మణ సంఘాల్లోని ప్రముఖుల్లో అత్యధికులు బీజేపీ మీద ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యోగిపై మండిపోతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మీద బ్రాహ్మణుల దెబ్బ పడటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ప్రమాధాన్ని గ్రహించటం వల్లే మోడి, అమిత్ ఇద్దరు బ్రాహ్మణ నేతలను బుజ్జగించేపనిలో పడ్డారు.

2017లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నా, 2019లో బీజేపీకి మెజారిటి లోక్ సభ సీట్లు వచ్చాయన్నా బ్రాహ్మణుల మద్దతు ఇవ్వటమే అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆప్ డెవలపింగ్ స్టడీస్ (సీఎస్డీఎస్) అనే సంస్ధ తేల్చిచెప్పింది. నిజానికి యూపీలో బ్రాహ్మణులు, యాదవులు, ముస్లింలు, ఎస్సీలదే కీలకపాత్ర. ఈ సామిజివకర్గాల్లో మెజారిటి ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తాయో ఆ పార్టీదే అధికారం. ఒకపుడు నాలుగు సామాజికవర్గాలు కాంగ్రెస్ తో నే ఉండేవి. అయితే రాజకీయ పరిణామాల కారణంగా సామాజికవర్గాల్లో చీలికలు వచ్చాయి.

యాదవులు, ముస్లింలు ఎస్పీ వైపు ఎస్సీలు బీఎస్పీలోకి, బ్రాహ్మణులు బీజేపీకి మద్దతుగా చీలిపోయారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో అన్నీ సామాజికవర్గాలు అన్నీ పార్టీల్లోకి మారిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇపుడు బ్రాహ్మణులను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ+బీఎస్పీ కూడా నానా అవస్తలు పడుతున్నాయి. ఎస్పీ, బీఎస్పీలు బ్రాహ్మణ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే సీఎం పదవిని బ్రాహ్మణులకే కేటాయిస్తామని ప్రకటించింది. బీజేపీ కూడా దూరమైన బ్రాహ్మణులను బుజ్జగించటానికి నానా అవస్తలు పడుతోంది. మరి ఈ సామాజికవర్గం చివరకు ఏమి చేస్తుందో చూడాల్సిందే.

This post was last modified on August 9, 2021 2:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

14 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago