Political News

పార్టీలన్నీ ఆ సామాజివకర్గం చుట్టునే తిరుగుతున్నాయా ?

మరో ఏడు నెలల్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పేట్లు లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే బలమైన బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీ మీద బాగా గుర్రుగా ఉండటమే. యూపీ జనాభాలో బ్రాహ్మణులు 12 శాతం ఉన్నారు. అదే ఓటర్లపరంగా చూస్తే బ్రాహ్మణుల శాతం 20. 20 శాతం ఓట్లంటే మామూలు విషయంకాదు. ఓ పార్టీని గద్దెమీద కూర్చోబెట్టాలన్నా, దింపేయాలన్నా 20 శాతం ఓట్లు సరిపోతాయి.

ఈ విషయం బాగా తెలియటం వల్లే ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్ నానా అవస్తలు పడుతున్నారు. యూపీలో అసలు సమస్య ఏమిటంటే యోగి పాలన వల్లే బ్రాహ్మణ సామాజికవర్గం బీజేపీకి దూరమైంది. గడచిన నాలుగేళ్ళల్లో సుమారు 500 మంది బ్రాహ్మణులు హత్యకు గురయ్యారని అఖిల భారత బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు రాజేంద్రనాద్ త్రిపాఠి ఆరోపించారు.

ఇంతేకాకుండా ఓ పద్దతి ప్రకారం బ్రాహ్మణులను యోగి ప్రభుత్వం అణిచివేస్తోందని సామాజికవర్గంలోని ప్రముఖులు పదే పదే ఆరోపిస్తున్నారు. బ్రాహ్మణ సంఘాల్లోని ప్రముఖుల్లో అత్యధికులు బీజేపీ మీద ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యోగిపై మండిపోతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మీద బ్రాహ్మణుల దెబ్బ పడటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ప్రమాధాన్ని గ్రహించటం వల్లే మోడి, అమిత్ ఇద్దరు బ్రాహ్మణ నేతలను బుజ్జగించేపనిలో పడ్డారు.

2017లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నా, 2019లో బీజేపీకి మెజారిటి లోక్ సభ సీట్లు వచ్చాయన్నా బ్రాహ్మణుల మద్దతు ఇవ్వటమే అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆప్ డెవలపింగ్ స్టడీస్ (సీఎస్డీఎస్) అనే సంస్ధ తేల్చిచెప్పింది. నిజానికి యూపీలో బ్రాహ్మణులు, యాదవులు, ముస్లింలు, ఎస్సీలదే కీలకపాత్ర. ఈ సామిజివకర్గాల్లో మెజారిటి ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తాయో ఆ పార్టీదే అధికారం. ఒకపుడు నాలుగు సామాజికవర్గాలు కాంగ్రెస్ తో నే ఉండేవి. అయితే రాజకీయ పరిణామాల కారణంగా సామాజికవర్గాల్లో చీలికలు వచ్చాయి.

యాదవులు, ముస్లింలు ఎస్పీ వైపు ఎస్సీలు బీఎస్పీలోకి, బ్రాహ్మణులు బీజేపీకి మద్దతుగా చీలిపోయారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో అన్నీ సామాజికవర్గాలు అన్నీ పార్టీల్లోకి మారిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇపుడు బ్రాహ్మణులను ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ+బీఎస్పీ కూడా నానా అవస్తలు పడుతున్నాయి. ఎస్పీ, బీఎస్పీలు బ్రాహ్మణ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే సీఎం పదవిని బ్రాహ్మణులకే కేటాయిస్తామని ప్రకటించింది. బీజేపీ కూడా దూరమైన బ్రాహ్మణులను బుజ్జగించటానికి నానా అవస్తలు పడుతోంది. మరి ఈ సామాజికవర్గం చివరకు ఏమి చేస్తుందో చూడాల్సిందే.

This post was last modified on August 9, 2021 2:38 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

17 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

27 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

46 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago