కర్నాటకలో మంత్రివర్గం ఏర్పడి ఇంకా పదిరోజులు కూడా కాలేదు అప్పుడే ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి అసమ్మతి సెగ మొదలైంది. తమకు కేటాయించిన శాఖలపై ముగ్గురు మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు గోడలమధ్య మాత్రమే తమ అసంతృప్తిని వ్యక్తంచేసేవారు. కానీ ఇపుడు మాత్రం తమకు కేటాయించిన శాఖలపైన, బొమ్మై పైన నేరుగా మీడియాతోనే తమ అసంతృప్తిని పంచుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఎంటీబీ నాగరాజు, శ్రీరాములు, ఆనంద్ సింగ్ లు తమ అసంతృప్తిని నేరుగా బొమ్మైతో పాటు మీడియా ముందు కూడా వ్యక్తం చేశారు. నాగరాజు అయితే ఏకంగా తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా కూడా జనాలతో పంచుకోవటం విడ్డూరంగా ఉంది. తనకు ముఖ్యమైన శాఖలు కేటాయిస్తానని చెప్పిన బొమ్మై నిరాసపరిచినట్లు చెప్పారు. మూడు రోజులు వెయిట్ చేస్తానని తనకిచ్చిన మున్సిపల్, చిన్న తరహా పరిశ్రమల శాఖలను తప్పించి ప్రాధాన్యతున్న శాఖలను కేటాయించకపోతే రాజీనామా చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చేశారు.
ఇక శ్రీరాములైతే తనకు కేటాయించిన రవాణా శాఖతో తనకు సంతృప్తి లేదన్నారు. తనకు ఇంకా ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయిస్తారని అనుకున్నట్లు చెప్పారు. బొమ్మై తనను తీవ్రంగా నిరాసపరిచినట్లు తెగ బాధఫడిపోతున్నారు. అసలు తనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందని శ్రీరాములు ఆశించి భంగపడ్డారు. అలాంటిది నష్టాల్లో ఉన్న రవాణా శాఖను తీసుకుని ఏమి చేయాలంటు నిలదీస్తున్నారు.
ఇక పర్యావరణ, పర్యాటక రంగ శాఖల మంత్రి ఆనందసింగ్ కతేవేరు. తనకు దక్కాల్సిన శాఖల కోసం పోరాటం చేసైనా దక్కించుకుంటానని శపథం చేశారు. తనకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకునే రకం కాదని అయితే ఏమి చేస్తానో ఇప్పుడే చెప్పనని వార్నింగ్ కూడా ఇచ్చారు. తన విషయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే తాను ఏమి చేయాలనేది ఆధారపడుంటుందని గట్టిగానే చెప్పారు.
విషయం ఏమిటంటే ప్రతిమంత్రి కూడా తనకు ఆర్ధిక, రెవిన్యు, హోం లాంటి ముఖ్యమైన శాఖలనే కోరుకుంటే ఇక మిగిలిన శాఖలను ఎవరికి కేటాయించాలి ? మంత్రిపదవి దక్కితే చాలని ఒకవైపు ఎంఎల్ఏలు ఎదురుచూస్తుంటే మరోవైపు తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేయటం చాలా విచిత్రంగా ఉంది. మొత్తానికి తాజాగా మొదలైన అసంతృప్తుల వెనుక మాజీ సీఎం యడ్యూరప్ప హస్తముందా అనే అనుమానాలు మొదలయ్యాయి. చూద్దాం నాలుగు రోజులాగితే ఏ విషయం బయటపడుతుందిగా.
This post was last modified on August 9, 2021 1:41 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…