Political News

సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమ‌ర్స్‌కు షాక్‌

త‌మ సంస్థ‌కు వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థకు చుక్కెదురైంది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమ‌ని.. విచార‌ణ హైకోర్టు, ఎన్జీటీలే చూసుకుంటాయ‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

విశాఖ‌ప‌ట్నంలోని గోపాల ప‌ట్నంలో ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ నుంచి స్టెరీన్ గ్యాస్ లీక్ కార‌ణంగా ఇద్ద‌రు పిల్ల‌లు స‌హా 12 మంది ప్రాణాలు కోల్పోవ‌డం, వంద‌ల మంది అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆ ప్లాంటును మూసి వేయాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే సంస్థ ప్ర‌తినిధులు ఎవ్వ‌రూ విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని, వారి పాస్ పోర్టుల‌ను సీజ్ చేయాల‌ని కూడా హైకోర్టు ఆదేశించింది. మ‌రోవైపు ఈ విషాదంపై విచార‌ణ‌కు ఎన్జీటీ ఏడు క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది.

ఐతే హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ప్లాంట్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల దృష్ట్యా లోనికి వెళ్లేందుకు త‌మ సిబ్బందికి అనుమతి ఇవ్వాల‌ని కోరింది. అలాగే ఎన్జీటీ ఏర్పాటు చేసిన ఏడు క‌మిటీల్లో విచార‌ణ కోసం దేని ముందు హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది.

ఐతే ఈ కేసులో జోక్యం చేసుకోవ‌డానికి సుప్రీం కోర్టు నిరాక‌రించింది. వీటిపై ఎన్జీటీ లేదా హైకోర్టు మాత్ర‌మే పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది. దీంతో ఎల్జీ సంస్థకు మ‌రో ఆప్ష‌న్ లేక‌పోయింది.

పెద్ద విషాదానికి కార‌ణ‌మైన ఎల్జీ సంస్థ ప‌ట్ల ఏపీ స‌ర్కారు అంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌ట్లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో హైకోర్టు, ఎన్జీటీ జోక్యం చేసుకుని క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. సుప్రీం కోర్టులో ఆ సంస్థ‌కు చుక్కెదురైన నేప‌థ్మంలో హైకోర్టు, ఎన్జీటీ త‌దుప‌రి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తాయో చూడాలి.

This post was last modified on May 26, 2020 7:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

17 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago