Political News

సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమ‌ర్స్‌కు షాక్‌

త‌మ సంస్థ‌కు వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థకు చుక్కెదురైంది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమ‌ని.. విచార‌ణ హైకోర్టు, ఎన్జీటీలే చూసుకుంటాయ‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

విశాఖ‌ప‌ట్నంలోని గోపాల ప‌ట్నంలో ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ నుంచి స్టెరీన్ గ్యాస్ లీక్ కార‌ణంగా ఇద్ద‌రు పిల్ల‌లు స‌హా 12 మంది ప్రాణాలు కోల్పోవ‌డం, వంద‌ల మంది అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆ ప్లాంటును మూసి వేయాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే సంస్థ ప్ర‌తినిధులు ఎవ్వ‌రూ విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని, వారి పాస్ పోర్టుల‌ను సీజ్ చేయాల‌ని కూడా హైకోర్టు ఆదేశించింది. మ‌రోవైపు ఈ విషాదంపై విచార‌ణ‌కు ఎన్జీటీ ఏడు క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది.

ఐతే హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ప్లాంట్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల దృష్ట్యా లోనికి వెళ్లేందుకు త‌మ సిబ్బందికి అనుమతి ఇవ్వాల‌ని కోరింది. అలాగే ఎన్జీటీ ఏర్పాటు చేసిన ఏడు క‌మిటీల్లో విచార‌ణ కోసం దేని ముందు హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది.

ఐతే ఈ కేసులో జోక్యం చేసుకోవ‌డానికి సుప్రీం కోర్టు నిరాక‌రించింది. వీటిపై ఎన్జీటీ లేదా హైకోర్టు మాత్ర‌మే పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది. దీంతో ఎల్జీ సంస్థకు మ‌రో ఆప్ష‌న్ లేక‌పోయింది.

పెద్ద విషాదానికి కార‌ణ‌మైన ఎల్జీ సంస్థ ప‌ట్ల ఏపీ స‌ర్కారు అంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌ట్లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో హైకోర్టు, ఎన్జీటీ జోక్యం చేసుకుని క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. సుప్రీం కోర్టులో ఆ సంస్థ‌కు చుక్కెదురైన నేప‌థ్మంలో హైకోర్టు, ఎన్జీటీ త‌దుప‌రి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తాయో చూడాలి.

This post was last modified on May 26, 2020 7:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago