లాక్ డౌన్ సడలింపులు వచ్చేశాయి. జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ప్రయాణాలు సాగిపోతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరిగేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ప్రభావం బాగా తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ ఆ మహమ్మారి అత్యంత ప్రభావం చూపిస్తున్నది ఇప్పుడే.
రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాల స్థాయికి భారత్ వచ్చేసింది. నిన్నట్నుంచి 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఆరు వేలకు పైగా కేసులు, 150 దాకా మరణాలు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మొత్తం దేశంలో కరోనా కేసులు లక్షా 45 వేల దాకా ఉండటం గమనార్హం. గత పది రోజుల వ్యవధిలోనే 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటిపోయింది.
ఇక మహారాష్ట్రలో అయితే కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే దేశవ్యాప్త కేసుల్లో మూడు వంతు ఉన్నాయి. కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇప్పటిదాకా 1635 మంది చనిపోయారు. మెజారిటీ కేసులు ముంబయిలోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముంబయిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రభుత్వం టేకోవర్ చేసింది.
ప్రతి కోవిడ్ ఆసుపత్రీ కిక్కిరిసి కనిపిస్తోంది. ముంబయిలోని కేఈఎం ఆసుపత్రిలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. చనిపోయిన వారిని మార్చురీ దగ్గర కవర్లలో చుట్టి టేబుళ్ల మీద పడుకోబెట్టిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతదేహాలు డబుల్ డిజిట్లో కనిపిస్తున్నాయి. ఇది అక్కడి కోవిడ్ మరణాల తీవ్రతకు అద్దం పెడుతోంది. ఒక్క ముంబయి సిటీలోనే 30 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వెయ్యి మందికి పైగా మరణించారు.
This post was last modified on May 26, 2020 2:55 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…