లాక్ డౌన్ సడలింపులు వచ్చేశాయి. జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ప్రయాణాలు సాగిపోతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరిగేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ప్రభావం బాగా తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ ఆ మహమ్మారి అత్యంత ప్రభావం చూపిస్తున్నది ఇప్పుడే.
రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాల స్థాయికి భారత్ వచ్చేసింది. నిన్నట్నుంచి 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఆరు వేలకు పైగా కేసులు, 150 దాకా మరణాలు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మొత్తం దేశంలో కరోనా కేసులు లక్షా 45 వేల దాకా ఉండటం గమనార్హం. గత పది రోజుల వ్యవధిలోనే 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటిపోయింది.
ఇక మహారాష్ట్రలో అయితే కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే దేశవ్యాప్త కేసుల్లో మూడు వంతు ఉన్నాయి. కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇప్పటిదాకా 1635 మంది చనిపోయారు. మెజారిటీ కేసులు ముంబయిలోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముంబయిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రభుత్వం టేకోవర్ చేసింది.
ప్రతి కోవిడ్ ఆసుపత్రీ కిక్కిరిసి కనిపిస్తోంది. ముంబయిలోని కేఈఎం ఆసుపత్రిలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. చనిపోయిన వారిని మార్చురీ దగ్గర కవర్లలో చుట్టి టేబుళ్ల మీద పడుకోబెట్టిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతదేహాలు డబుల్ డిజిట్లో కనిపిస్తున్నాయి. ఇది అక్కడి కోవిడ్ మరణాల తీవ్రతకు అద్దం పెడుతోంది. ఒక్క ముంబయి సిటీలోనే 30 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వెయ్యి మందికి పైగా మరణించారు.
This post was last modified on May 26, 2020 2:55 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…