లాక్ డౌన్ సడలింపులు వచ్చేశాయి. జనాలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అన్ని దుకాణాలూ తెరుచుకున్నాయి. ప్రయాణాలు సాగిపోతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు తిరిగేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా ప్రభావం బాగా తగ్గిపోయిందని అనుకోవాలి. కానీ ఆ మహమ్మారి అత్యంత ప్రభావం చూపిస్తున్నది ఇప్పుడే.
రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాల స్థాయికి భారత్ వచ్చేసింది. నిన్నట్నుంచి 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఆరు వేలకు పైగా కేసులు, 150 దాకా మరణాలు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మొత్తం దేశంలో కరోనా కేసులు లక్షా 45 వేల దాకా ఉండటం గమనార్హం. గత పది రోజుల వ్యవధిలోనే 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటిపోయింది.
ఇక మహారాష్ట్రలో అయితే కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆ రాష్ట్రంలో మాత్రమే దేశవ్యాప్త కేసుల్లో మూడు వంతు ఉన్నాయి. కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇప్పటిదాకా 1635 మంది చనిపోయారు. మెజారిటీ కేసులు ముంబయిలోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముంబయిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రభుత్వం టేకోవర్ చేసింది.
ప్రతి కోవిడ్ ఆసుపత్రీ కిక్కిరిసి కనిపిస్తోంది. ముంబయిలోని కేఈఎం ఆసుపత్రిలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. చనిపోయిన వారిని మార్చురీ దగ్గర కవర్లలో చుట్టి టేబుళ్ల మీద పడుకోబెట్టిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతదేహాలు డబుల్ డిజిట్లో కనిపిస్తున్నాయి. ఇది అక్కడి కోవిడ్ మరణాల తీవ్రతకు అద్దం పెడుతోంది. ఒక్క ముంబయి సిటీలోనే 30 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వెయ్యి మందికి పైగా మరణించారు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…