Political News

రాజీవ్ ఆన‌వాళ్లు లేకుండా.. ప్ర‌జ‌ల పేరుతో మోడీ ‘రాజ‌కీయం’

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. వ‌రుస విజ‌యాలు సాధించి.. కాంగ్రెస్‌ను ఇప్ప‌టికే ఊపిరి స‌ల‌ప‌నీయ‌ని విధంగా ఇరుకున పెడుతోంది. అంతేకాదు.. బ‌ల‌మైన కాంగ్రెస్ కంచుకోట‌ల‌ను కూడా ద‌క్కించుకుని.. కాంగ్రెస్ ఉనికినే ప్ర‌శ్నార్థకం చేస్తోంది. క‌నుచూపు మేర‌లో.. కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా ప్ర‌ధాని మోడీ- కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు.. కాంగ్రెస్‌ను ఇప్ప‌టికే ఇర‌కాటంలోకి నెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ను మాత్ర‌మే కాకుండా.. కాంగ్రెస్ వెనుక ఉన్న గాంధీల కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని.. ఇప్ప‌టికే గాంధీల వార‌సుడు.. యువ నేత రాహుల్ గాంధీని ‘ప‌ప్పు’ను చేసేశారు.

ఈ ముద్ర నుంచి త‌ప్పించుకునేందుకు.. త‌ను యాక్టివ్ అయ్యేందుకు రాహుల్ ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. సాధ్యం కాని రీతిలో మోడీ-షా ద్వ‌యం చేస్తున్న విన్యాసం.. రాహుల్ రాజ‌కీయ భ‌విత‌పై పెద్ద బండే వేస్తోంద‌న్న అభిప్రాయం జాతీయ రాజ‌కీయాల్లో వ్య‌క్త‌మ‌వు తోంది. ఇక‌, ఇప్పుడు మ‌రింత దూకుడుగా మోడీ, షా ద్వ‌యం వ్య‌వ‌హ‌రిస్తన్నార‌నే కామెంట్లు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. అస‌లు దేశ ప్ర‌స్థానంలోనే గాంధీల పేరు వినిపించ‌కుండా చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి.

తాజాగా మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా.. కొన‌సాగుతున్న ‘రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న‌’ వంటి ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారం పేరును మోడీ స‌ర్కారు మార్చేసింది. ఇది వాస్త‌వానికి రాజీవ్‌గాంధీ స్మృత్య‌ర్థం తీసుకువ‌చ్చిన పేరు మాత్ర‌మే కాదు.. రాజీవ్‌కు క్రీడ‌ల‌పై ఉన్న ఆస‌క్తికి గుర్తుగా ఆయ‌న‌కు అంజ‌లి ఘ‌టిస్తూ.. అప్ప‌టి ప్ర‌బుత్వం దీనిని ఏర్పాటు చేసింది. అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏటా.. జాతీయ స్థాయిలో క్రీడ‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ చూపిన వారికి ఈ అవార్డును ఇస్తున్నారు.

అంతేకాదు.. రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న అందుకోవ‌డం.. క్రీడాకారుల జీవితంలో ఒక అద్భుత ఘ‌ట్టంగా బావిస్తుంటారు. అయితే.. ఈ అవార్డులో రాజీవ్ గాంధీ పేరు ఉండ‌డాన్ని మోడీ స‌హించ‌లేక పోతున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జాభిప్రాయం పేరిట‌… ఆయ‌న తాజాగా.. దీనికి పేరు మార్చేశారు. హాకీలో అద్భుత ప్ర‌తిభ‌ను చూపిన మేజ‌ర్ ధ్యాన్ చంద్ పేరును ఈ అవార్డుకు పెడుతూ.. తాజాగా నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ధ్యాన్ చంద్ పేరు పెట్ట‌డం మంచిదే అయినా.. రాజీవ్ గాంధీ పేరును తీసేయ‌డం.. వెనుక రాజకీయ కార‌ణాలే ఉన్నాయ‌ని.. అంత‌కు మించి ఏమీలేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై కాంగ్రెస్ నేత‌లు, ముఖ్యంగా రాజీవ్ త‌న‌యుడు రాహుల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 8, 2021 12:05 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

41 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

43 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

4 hours ago