Political News

అధ్యక్షునిగా ఎవరైనా ఒకటేనా ?

రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సారధిగా ఎవరున్నా ఒకటేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్న ఆలోచన కేంద్రంలోని పెద్దలకే లేనపుడు పార్టీ ఇక ఎలా బలపడుతుంది ? అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కటమే టార్గెట్ గా పెట్టుకుని నరేంద్రమోడి సర్కార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అదేదో ఏపిపై పగతోనే మోడి వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రాష్ట్రప్రయోజనాలను తూచా తప్పుకుండా అమలు చేసుంటే అన్నా పార్టీకి జనాల్లో ఎంతో కొంత ఆదరణ పెరిగేది. అలాకాకుండా రివర్సులో విభజన చట్టాన్ని తుంగలో తొక్కేసిన ఫలితంగా అరా కొర ఉన్న పార్టీ పట్టు కూడా జారిపోయింది. పార్టీ తరపున ఎక్కడ పోటీచేసినా డిపాజిట్లు కూడా రావటంలేదంటే అందుకు కేంద్ర నాయకత్వాన్ని మాత్రమే నిందించాలి కానీ రాష్ట్ర పార్టీకి ఏమీ సంబంధంలేదు. అసలు మొదటినుండి ఏపిలో పార్టీకి ఉన్న బలమే అంతంతమాత్రం.

ఏదో బలమైన గాలి వీస్తేనో లేకపోతే గట్టి పార్టీతో పొత్తు పెట్టుకున్నపుడు మాత్రమే నాలుగు సీట్లు వస్తాయి. లేకపోతే కనీసం డిపాజిట్లు కూడా రాదు. ఇపుడు బీజేపీకి అధ్యక్షుడిగా సోము వీర్రాజున్నా ఒకటే ఆయన స్ధానంలో మరొకరున్నా ఒకటే. ఎందుకంటే పార్టీలోని నేతలు బలమైన వారు కాకపోవటం ఒకటైతే రాష్ట్రప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కుతుండుటం మరో కారణం. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణాలో పార్టీ బలంగా ఉందనే ప్రచారం కూడా ఉత్తదే.

ఎందుకంటే మొదటినుండి బీజేపీ ఏపీలో కన్నా తెలంగాణాలో గట్టిగానే ఉంది. బండి సంజయ్ వల్ల బలంతా తయారుకాలేదని గ్రహించాలి. ఎలాగంటే మొదటినుండి సికింద్రాబాద్ పార్లమెంటు సీటులో కమలం గెలుస్తోంది, ఓడుతోంది. అలాగే కిషన్ రెడ్డి అంబర్ పేటలో గెలుస్తున్నారు, ఓడుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు తెలంగాణాలో మరో మూడు నాలుగున్నాయి. అంతేకాని బండి వల్లే పార్టీ బలోపేతమయ్యిందేమీ లేదు.

ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలో బీజేపీ కేసీయార్ ప్రభుత్వం మీద గట్టిగానే పోరాటాలు చేస్తున్నది నిజమే. ఎందుకంటే అందుకు కేంద్ర నాయకత్వమే ప్రోత్సహిస్తోంది కాబట్టి. బీజేపీకి కేసీయార్ కు బద్ధ విరోధముంది కాబట్టే కేంద్ర నాయకత్వం కూడా ప్రోత్సహిస్తోంది. అదే ఏపికి వచ్చేటప్పటికి పార్లమెంటులో మోడి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకుంటున్నారు. కాబట్టి జగన్ మీద కేంద్రానికి సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా ఏపిలో నేతలు కూడా క్షేత్రస్ధాయిలో బలమైన వారు కాదు. 2019 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట ఎంపిగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు సుమారు 16500 మాత్రమే. కాబట్టి పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నా ఒకటే.

This post was last modified on August 8, 2021 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago