Political News

విశాఖ టీడీపీ ఎంపీ క్యాండెట్ భ‌ర‌త్ కాదా… !

విశాఖ టీడీపీ వచ్చే ఎన్నికల మీద దృష్టి పెడుతోంది. దాని కోసం తగిన కసరత్తు కూడా చేస్తోంది. ఆ మధ్యన టీడీపీ పార్టీ కార్యవర్గాలు ప్రకటించడం వెనక కూడా కొత్త ముఖాలను రంగంలోకి తీసుకురావాలి అన్న ఆలోచన ఉందని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటుని ఈసారి కచ్చితంగా గెలుచుకోవాలి అని టీడీపీ పంతం పడుతోంది. 1999 తరువాత టీడీపీ ఇక్కడ గెలవలేదు. చివరిసారిగా ఎంవీవీఎస్ మూర్తి ఆనాడు గెలిచారు. ఇక 2004, 2009ల‌లో రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. అలాగే 2014లో బీజేపీ గెలిస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ తొలిసారిగా గెలిచి జెండా ఎగరేసింది. ఈ నేపధ్యంలో టీడీపీకి విశాఖ ఎంపీ సీటు దక్కక 2024 నాటికి కచ్చితంగా పాతికేళ్ళు అవుతుంది అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాల‌య్య చిన్న అల్లుడు శ్రీ భ‌ర‌త్‌ను పోటీకి దింపినా కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.

ఈ సారి కూడా ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర‌క‌పోతే అది ఘోర అవ‌మాన‌మే అవుతుంది. అయితే ఈసారి మాత్రం టీడీపీ తన స్ట్రాటజీ మారుతోంది అంటున్నారు. అదేంటి అంటే బలమైన సామాజికవర్గాన్ని ముందు పెట్టి గెలుపు జూదం ఆడడం. విశాఖ జిల్లాలో బీసీలుగా అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజికవర్గానికి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయిపోయింది. అందుకే పల్లా శ్రీనివాస్ ని తెచ్చి విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ ని చేసింది. ఆయన గతంలో అంటే 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి రెండు లక్షల యాభైవేల‌ దాకా ఓట్లను సంపాదించారు. ఆ తరువాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి గెలిచారు.

2019 ఎన్నికలలో ఓడినా కూడా ఆయనకు గట్టి పట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌ల్లా ప‌వ‌న్‌ను వెన‌క్కు నెట్టేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఇప్పుడు విశాఖ‌లో వైసీపీ యాద‌వ వ‌ర్గాన్ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకునే ప్లాన్‌లో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతోంది. వైసీపీలో అక్క‌డ ప‌ద‌వులు అన్ని యాద‌వుల‌కే ఇస్తున్నారు. దాంతో అదే వ‌ర్గానికి చెందిన ప‌ల్లాకే విశాఖ ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకోవాలని టీడీపీ ఆలోచిస్తోందిట. టీడీపీ అనగానే కమ్మ సామాజికవర్గమే ముందుంటుంది. దానిని నిజం చేసేలా అనేక పర్యాయాలు ఎంవీవీఎస్ మూర్తికే టికెట్ ఇచ్చారు.

ఆయన మొత్తం రెండు సార్లు గెలిస్తే మరో మూడు సార్లు ఓడిపోయారు. ఇక వలస నేతలకు టికెట్లు ఇస్తున్నారు అన్న మచ్చ కూడా టీడీపీ మీద ఉంది. దాన్ని ఈసారి తుడిచేసుకుని పల్లాకు టికెట్ ఇవ్వడం ద్వారా పాతికేళ్ళుగా దక్కని ఎంపీ సీటుని దక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. మరి దీనికి ధీటుగా వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on August 6, 2021 7:58 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago