Political News

విశాఖ టీడీపీ ఎంపీ క్యాండెట్ భ‌ర‌త్ కాదా… !

విశాఖ టీడీపీ వచ్చే ఎన్నికల మీద దృష్టి పెడుతోంది. దాని కోసం తగిన కసరత్తు కూడా చేస్తోంది. ఆ మధ్యన టీడీపీ పార్టీ కార్యవర్గాలు ప్రకటించడం వెనక కూడా కొత్త ముఖాలను రంగంలోకి తీసుకురావాలి అన్న ఆలోచన ఉందని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటుని ఈసారి కచ్చితంగా గెలుచుకోవాలి అని టీడీపీ పంతం పడుతోంది. 1999 తరువాత టీడీపీ ఇక్కడ గెలవలేదు. చివరిసారిగా ఎంవీవీఎస్ మూర్తి ఆనాడు గెలిచారు. ఇక 2004, 2009ల‌లో రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. అలాగే 2014లో బీజేపీ గెలిస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ తొలిసారిగా గెలిచి జెండా ఎగరేసింది. ఈ నేపధ్యంలో టీడీపీకి విశాఖ ఎంపీ సీటు దక్కక 2024 నాటికి కచ్చితంగా పాతికేళ్ళు అవుతుంది అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బాల‌య్య చిన్న అల్లుడు శ్రీ భ‌ర‌త్‌ను పోటీకి దింపినా కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.

ఈ సారి కూడా ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర‌క‌పోతే అది ఘోర అవ‌మాన‌మే అవుతుంది. అయితే ఈసారి మాత్రం టీడీపీ తన స్ట్రాటజీ మారుతోంది అంటున్నారు. అదేంటి అంటే బలమైన సామాజికవర్గాన్ని ముందు పెట్టి గెలుపు జూదం ఆడడం. విశాఖ జిల్లాలో బీసీలుగా అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజికవర్గానికి ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయిపోయింది. అందుకే పల్లా శ్రీనివాస్ ని తెచ్చి విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ ని చేసింది. ఆయన గతంలో అంటే 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి రెండు లక్షల యాభైవేల‌ దాకా ఓట్లను సంపాదించారు. ఆ తరువాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి గెలిచారు.

2019 ఎన్నికలలో ఓడినా కూడా ఆయనకు గట్టి పట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌ల్లా ప‌వ‌న్‌ను వెన‌క్కు నెట్టేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఇప్పుడు విశాఖ‌లో వైసీపీ యాద‌వ వ‌ర్గాన్ని పూర్తిగా త‌న వైపున‌కు తిప్పుకునే ప్లాన్‌లో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అవుతోంది. వైసీపీలో అక్క‌డ ప‌ద‌వులు అన్ని యాద‌వుల‌కే ఇస్తున్నారు. దాంతో అదే వ‌ర్గానికి చెందిన ప‌ల్లాకే విశాఖ ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకోవాలని టీడీపీ ఆలోచిస్తోందిట. టీడీపీ అనగానే కమ్మ సామాజికవర్గమే ముందుంటుంది. దానిని నిజం చేసేలా అనేక పర్యాయాలు ఎంవీవీఎస్ మూర్తికే టికెట్ ఇచ్చారు.

ఆయన మొత్తం రెండు సార్లు గెలిస్తే మరో మూడు సార్లు ఓడిపోయారు. ఇక వలస నేతలకు టికెట్లు ఇస్తున్నారు అన్న మచ్చ కూడా టీడీపీ మీద ఉంది. దాన్ని ఈసారి తుడిచేసుకుని పల్లాకు టికెట్ ఇవ్వడం ద్వారా పాతికేళ్ళుగా దక్కని ఎంపీ సీటుని దక్కించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. మరి దీనికి ధీటుగా వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

This post was last modified on August 6, 2021 7:58 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

3 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

4 hours ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

5 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

6 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

6 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

6 hours ago