Political News

ఏపీ మంత్రుల‌కే కాదు.. మంత్రుల మాటకు కూడా విలువ లేదా?

జ‌గ‌న్ కేబినెట్‌లో సీనియ‌ర్ మంత్రులుగా ఉన్న వారికి .. విలువ‌లేదా ? నాయ‌కులుగా.. మంత్రుల‌కే కాదు.. వారి మాట‌కు కూడా వాల్యూ లేకుండా చేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తి దానికీ.. త‌గుదున‌మ్మా.. అంటూ.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ముందుకు వ‌స్తున్నార‌ని.. చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కీల‌క‌మైన విష‌యాల్లో స‌జ్జ‌లే మీడియా ముందుకు వ‌స్తున్నారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపిస్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ వాద‌న‌ను కూడా వెల్ల‌డిస్తున్నారు.

అంతేకాదు.. మంత్రులు పాల్గొనే కార్య‌క్ర‌మాల్లోనూ స‌జ్జ‌లే హంగామా చేస్తున్నారు. దీంతో మంత్రుల‌కు వాల్యూ లేకుండా పోయిందా ? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఇటీవ‌ల హొం మంత్రి సుచ‌రిత పాల్గొన్న ఒక కార్య‌క్ర‌మానికి స‌ల‌హాదారుగా స‌జ్జ‌ల హాజ‌రై.. ఆ కార్య‌క్ర‌మానికి శంకుస్థాప‌న చేయ‌గా.. మంత్రి అయి ఉండి.. ఆమె ప‌క్క‌న నిల‌బ‌డి.. చ‌ప్ప‌ట్లు కొట్టే పరిస్థితి వ‌చ్చింది. దీంతో స‌జ్జ‌ల వ్య‌వ‌హారంపై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న‌కు కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి లేక‌పోయినా.. అప్ర‌క‌టిత‌.. హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఎస్సై స్థాయి అధికారిని మార్చాల‌న్నా స‌జ్జ‌ల ప‌ర్మిష‌న్ ఉండాల్సిందే అట‌..! ఇదిలావుంటే.. ఇప్పుడు మంత్రుల మాట‌ల‌కు కూడా వాల్యూలేకుండా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముందు మంత్రుల‌తో ప్రెస్‌మీట్లు పెట్టించ‌డం.. త‌ర్వాత‌..స‌జ్జ‌ల ఎంట్రీతో ప‌రిస్థితి మొత్తం మారిపోవడం వంటివి స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయి. గ‌తంలో వ్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ముందు.. మంత్రి ప్ర‌సంగించ‌డం.. త‌ర్వాత‌.. స‌జ్జ‌ల మాట్లాడ‌డం జ‌రిగేది. అయితే.. క‌న్న‌బాబు క‌న్నా కూడా స‌జ్జ‌ల‌కే ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో .. రామ‌కృష్ణారెడ్డే హైలెట్ అయ్యేవారు. చివ‌ర‌కు క‌న్న‌బాబు సైలెంట్ అయిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక‌, తాజాగా జ‌రిగిన ప‌రిణామంలోనూ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. తాజాగా ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు చెందిన‌ అమరరాజా సంస్థ విషయంపై మంత్రి బొత్స మాట్లాడుతూ.. లాభాలొచ్చే చోటుకు వాళ్లు వెళ్లిపోతున్నారని ప్రకటించారు. కానీ తర్వాత అనూహ్యంగా సజ్జల భిన్నమైన ప్రకటన చేశారు. అమరరాజా కంపెనీని తామే వెళ్లిపొమ్మన్నామని, అది కాలుష్య కారక పరిశ్రమ అని చెప్పారు. దీంతో బొత్స ప్రభుత్వాన్ని సమర్థిస్తే.. ఆ సంస్థే వెళ్లిపోతోందన్నట్లుగా మాట్లాడారు. కానీ.. తర్వాత సజ్జల భిన్నంగా మాట్లాడటంతో బొత్స మాటలకు విలువ లేకుండా పోయింది. ఒక్క ఈ విష‌యంలోనే కాదు.. స‌జ్జ‌ల వ్య‌వ‌హారం.. మంత్రుల‌ను మించి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 5, 2021 1:57 pm

Share

Recent Posts

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

2 hours ago

కవితకు… షర్మిలకు.. పోలికా?

కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…

3 hours ago

బండ్ల గణేష్ ఇంటి వేడుకలో త్రివిక్రమ్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. నటుడు-నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు చాలా దగ్గరైన మిత్రులే. కానీ…

3 hours ago

వైట్ల సినిమాకు ఇంత డిమాండా?

ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు శ్రీను వైట్ల. అప్పటి టాప్ స్టార్లంతా…

4 hours ago

కూతురికి ప్లాపొచ్చినా తల్లికి హిట్టు దక్కింది

గత నెల చివరి వారంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకు గుర్తే. ఘట్టమనేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన…

6 hours ago

సంక్రాంతికి అప్పుడే హౌస్ ఫుల్ బోర్డు

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే షార్ట్ సీజన్.. సంక్రాంతి. ఈ టైంలో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత…

7 hours ago