ఎప్పుడు జరుగుతుందో తెలీని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెంచేస్తోంది. గెలుపే లక్ష్యంగా ప్రతిపార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీలో తమ మద్దతుదారులతో సర్వేలు చేయించుకుంటున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కొన్ని సంస్ధలు స్వచ్చంధంగా నియోజకవర్గంలో సర్వేలు మొదలుపెట్టేశాయి. దాంతో హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా సర్వేల హడావుడే కనబడుతోంది. దాంతో పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
పార్టీల సర్వేలు ఎలాగూ ఉంటుంది. అయితే అవి అంతర్గతంగానే జరుగుతుంది కాబట్టి బయటకు తెలిసేది తక్కువనే చెప్పాలి. పార్టీ నేతల ద్వారా సర్వేల వివరాలు బయటకుపొక్కుతుంటాయి. అయితే కొన్ని సంస్ధలు, మీడియా సంస్ధలు కూడా దేనికవే సర్వేలు మొదలుపెట్టేశాయి. ఒకేసారి ఇన్ని సంస్ధలు జననాడి తెలుసుకునేందుకు సర్వేలు చేస్తుండటం బహుశా హుజూరాబాద్ లోనే మొదటిసారేమో. చాలా సంస్ధలు తమ తరపున మండలానికి 100 మంది యువతను సర్వేకోసం ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.
సర్వేపేరుతో నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా యువతే కనబడుతున్నారు. ఏ పార్టీ తరపున అభ్యర్ధిగా ఎవరుంటారు ? అసలు ఏ పార్టీకి ఓట్లేస్తారు ? బీజేపీ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న ఈటల రాజేందర్ పై అభిప్రాయం ఎలాగుంది ? కేసీయార్ పాలన ఎలాగుంది ? ఈటలను టీఆర్ఎస్ లో నుండి పంపేయటంపై జనాలు ఏమనుకుంటున్నారు ? ఈటలను కేసీయార్ అవమానించారని అనుకుంటున్నారా ?
కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటి ? కమలంపార్టీకి నియోజకవర్గంలో ఎంతబలముంది ? ఈటల హయాంలో నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ? ఈటల బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగటంపై అభిప్రాయమేమిటి ? ఈటలపైన ఉన్న భూకబ్జాల ఆరోపణలు నిజమేనా ? కాంగ్రెస్ తరపున అభ్యర్ధిగా ఎవరుంటే బాగుంటుంది ? లాంటి అనేక ప్రశ్నలతో యువకులు సర్వేలు జరుపుతున్నారు.
అసలే వేడెక్కిపోయిన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేందుకు కేసీయార్ హుజూరాబాద్ లో ఈనెల 16వ తేదీన పర్యటించబోతున్నారు. దళితబంధు పథకాన్ని లాంచ్ చేయటానికి కేసీయార్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలుపై ప్రతిపక్షాలు, కులసంఘాలు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా నియోజకవర్గంలో కేవలం 100 మందికి కాదని మొత్తం దళితులందరికీ వర్తింపచేయాలని పార్టీలు, దళితసంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి 16వ తేదీన కేసీయార్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on August 5, 2021 10:03 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…